MLA Ramulu Nayak: వైరా నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునేది లేదు.. పువ్వాడ పై రాములు నాయక్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Ramulu Nayak: పువ్వాడ అజయ్ కుమార్ పై ఎమ్మెల్యే రాములు నాయక్ ఫైర్ అయ్యారు. వైరా నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునేది లేదంటూ రాముల నాయక్ మంత్రి పువ్వాడ చేయకు హెచ్చరికలు జారీ చేశారు. వైరా నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లాలో తన ఒక్కడే గెలిచి మిగిలిన నియోజకవర్గాల్లో అందరూ ఓడిపోవాలని కుట్ర మంత్రి పువ్వాడ అజయ్ చేస్తున్నాడని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆరోపించారు. ఎమ్మెల్యేగా తన విధుల్ని నిర్వహించు కోనీయకుండా పువ్వాడ అజయ్ చేస్తున్నాడని ఆరోపించారు. కేటీఆర్ రాజు యువరాజు అయితే సామంత రాజుగా పువ్వాడ అజయ్ కుమార్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనపై కుట్రలు పన్నుతున్నాడని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని రాముల నాయక్ ఆరోపించారు. అంతేకాదు పువ్వాడ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యే వా? లేక వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నావా? అని ప్రశ్నించారు. దళిత బంధు లబ్ధిదారులు ఎంపికలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ రాముల్ నాయక ఆరోపించారు.
Read also: Minister KTR: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం.. అవకతవకలు జరిగితే బాధ్యత అధికారులదే
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు ఎంపికలు మంత్రి పువ్వాడ జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో విధులని ఆటంకపరిచే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. వైరా నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునేది లేదంటూ రాముల నాయక్ మంత్రి పువ్వాడ చేయకు హెచ్చరికలు జారీ చేశారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తన నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక చేపట్టినప్పటికీ ఎంపిక చేసిన లిస్టుని ఉన్నతాధికారులకు పంపించారు. అయితే తాజాగా వైరా ఎమ్మెల్యేగా మదన లాల్ లని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేయడంతో మరో లిస్టుని ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ లాల్ ఉన్నతాధికారులకు పంపించారు. మంత్రి పువ్వాడ అజయ్ అండదండలతోనే మదన్ లాల్ ఈ విధంగా తన వ్యవహారాల జోక్యం చేసుకుంటున్నారని రాముల్ నాయక ఆరోపిస్తున్నారు. తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినప్పటికీ మదన్ లాల్ కు సహకారం చేస్తానని చెప్పినప్పటికీ మదన్ లాల్ మంత్రి ఇద్దరు కలిసి దళిత బందు లబ్ధిదారుల ఎంపిక లో కుట్రలు చేయడం ఏమాత్రం సబబా అంటూ రాముల్ నాయక్ ప్రశ్నించారు. మరి దీనిపై పువ్వాడ అజయ్ కుమార్ ఎలా స్పందిస్తారునే విషయంపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
Minister KTR: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదు
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!