Raghunandan Rao: ఏ చట్ట ప్రకారం మంత్రి గాల్లో కాల్పులు జరిపారు.. సస్పెండ్ చేయండి
మహబూబ్నగర్ ఫ్రీడం ఫర్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్గౌడ్ గాల్లోకి కాల్పులు జరపటం కలకలంరేపుతుంది. దీనిపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిన్న మహబూబ్నగర్లో ఏ చట్ట ప్రకారం తుపాకి తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపారని ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఏమైనా లైసెన్స్ ఉందా అని రఘునందన్రావు అడిగారు. దీనిపై మాట్లాడేందుకు డీజీపీ ఆఫీసుకు ఎప్పుడు రమ్మంటారు, మంత్రి పేల్చిన తుపాకిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని అన్నారు. లేకుంటే.. రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని, ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రఘునందన్రావు కోరారు.
అయితే.. భారతీయ శిక్షా స్మృతి, రాజ్యాగం ప్రకారం ఈ చట్టాలలో ఎక్కడ అన్న ఎస్పీకి ఒక ప్రైవేట్ వ్యక్తికి తుపాకీ ఇచ్చి కాల్చమని చెప్పే చట్టముందా అంటూ ప్రశ్నించారు. తను ఒక బాధ్యత గల మంత్రి, తన గన్మెన్ దగ్గర నుంచి తీసుకున్నారు. కానీ.. దాని కప్పి పుచ్చుకోవాడానికి ఎస్పీ నేనే ఆ తుపాకీ ఇచ్చాను అని చెప్పారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఎస్పీపై చర్యలు తీసుకోవాలని, శ్రీనివాస్ గౌడ్ను వెంటనే మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్డ్ అయ్యాక వచ్చే సలహాదారు పోస్టు కోసమే ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు.
Also Read
- IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Fuel Shortage Telangana : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సివిల్ సప్లై శాఖ కీలక ప్రకటన
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
అసలేం జరిగింది?
ఫ్రీడం ఫర్ ర్యాలీ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో.. మహబూబ్నగర్ ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ మైదానం నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే..ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ర్యాలీ ప్రారంభ సమయంలో తుపాకీ తీసుకుని గాల్లోకి ఒక రౌండు కాల్పులు జరిపారు. దీంతో పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి కాల్పులు జరపటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మంత్రే స్వయంగా వివరణ ఇచ్చారు. తను ఫ్రీడం రన్ ప్రారంభోత్సవం వేళ రబ్బర్ బుల్లెట్ తుపాకీని పేల్చినట్లు స్పష్టం చేశారు. మంత్రికి తుపాకీ ఎస్పీనే స్వయంగా ఇచ్చారని వివరించారు. అయితే.. గతంలోనూ క్రీడల ప్రారంభోత్సవ సమయంలో రబ్బర్ బుల్లెట్ పేల్చినట్లు చెప్పారు. కావాలనే కొందరు అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
Gorantla Madhav: టీడీపీ నేతలకు సవాల్.. చంద్రబాబు వీడియోను అమెరికా ల్యాబ్లో టెస్ట్ చేయించాలి
తాజావార్తలు
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
-
Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
-
Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
-
IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?