All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
- అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా..
- టీఎంసీ రెబల్ ఎంపీలను ఆహ్వానించడంపై ఇండియా కూటమి అభ్యంతరం..
- కాసేపు వాకౌట్, ఆ తర్వాత సమావేశంలో పాల్గొన్న నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
All-Party Meeting: జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్కు పిలుపునిచ్చింది. అయితే, ఈ సమావేశంలో హైడ్రామా చోటుచేసుకుంది. తిరుగుబాటు చేసిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఎంపీలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఆధ్వర్యంలో పార్లమెంట్ అనెక్సీ భవనంలో ఈ సమావేశం జరిగింది. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టనున్న బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. అయితే, ఈ సమావేశానికి టీఎంసీ రెబల్ ఎంపీలను కేంద్రం ఆహ్వానించింది. దీనిపై ఇండియా కూటమి పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read
టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఇండియా (NCPI) పార్టీలో విలీనమయ్యారు. వీరికి ప్రత్యేకంగా ఒక టేబుల్ కేటాయించడం వివాదాస్పదమైంది. దీనికి నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు సమావేశం నుంచి బయటకు వెళ్లారు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తిరుగుబాటు ఎంపీల కొత్త పార్టీని ఇంకా అధికారికంగా గుర్తించలేదని, అలాంటప్పుడు వారిని ఎలా సమావేశానికి ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. వాకౌట్ చేసిన పార్టీల్లో సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, జేఎంఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, వామపక్ష పార్టీలు, శివసేన(యూబీటీ)లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!