MLA Jagga Reddy: ‘ఆరోగ్య శ్రీ’ని కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Jagga Reddy Request CM KCR To Focus On Arogyasri Scheme: ‘ఆరోగ్య శ్రీ’ అమలు కావడం లేదని ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ‘ఆరోగ్య శ్రీ’ని సీఎం కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ప్రతి మనిషినీ బతికించే ఆలోచన ప్రభుత్వం చేయాలని హితవు పలికారు. పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడం వల్ల.. అనేక కుటుంబాలు వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. బిల్లు 10 లక్షలు అయితే.. సీఎంఆర్ఎఫ్ (చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్) కేవలం రూ. 30 వేలే ఇస్తోందని మండిపడ్డారు. కానీ.. ఇదే కాంగ్రెస్ హయాంలో ‘ఆరోగ్య శ్రీ’ పూర్తిగా అమలయ్యేదని అన్నారు. 10 లక్షల బిల్లు వస్తే.. కాంగ్రెస్ హయాంలో రూ. 8 లక్షల సీఎంఆర్ఎఫ్ వచ్చేదని తెలిపారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ఆలోచించి పేద ప్రజల కోసం ఆరోగ్య శ్రీ పథకం తీసుకొచ్చారని.. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా ఆ పథకం బాగా అమలు అయ్యిందని జగ్గారెడ్డి చెప్పారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలో కూడా ప్రతి పేదవాడికి సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఎక్కువ మొత్తంలోనే చెల్లింపులు జరిగాయన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఆరోగ్య శ్రీ మీద దృష్టి పెట్టాలని.. ప్రతి కార్పొరేట్ హిస్పిటల్లో అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఇంటిలిజెన్స్ వాళ్ళు ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాల్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళేవారని.. మరి ప్రస్తుత ఇంటిలిజెన్స్ చీఫ్ ఎప్పుడైనా ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో సీఎం దృష్టికి తీసుకెళ్లారా? అని ప్రశ్నించారు. ఇప్పుడున్న ఇంటిలిజెన్స్ అంతా.. ఏ లీడర్ ఎక్కడ పడుకున్నాడు, ఏం చేస్తున్నారు? అనే పనిలోనే పడ్డారని ఎద్దేవా చేశారు. ఇకనైనా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పూర్తిగా అమలు అయ్యేలా చూడాలని.. హరీష్ రావు, సీఎం కేసీఆర్ ఈ పథకం అమలుపై ఫోకస్ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!