Minister Prashanth Reddy: యువతకు దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఆయన చెప్పు కొచ్చారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వలేదని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశామని తెలిపారు.. సీఎం కేసీఆర్ సంపద సృష్టించి పేదలకు పంచుతున్నారని వేముల వెల్లడించారు. తెలంగాణకు బీఆర్ఎస్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు.
Read Also: Naveen Polishetty : అనుష్క తో సినిమా చేయాలనే నా డ్రీమ్ నెరవేరింది..
Also Read
నిజామాబాద్ లో ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తా అంటే కవితమ్మను ఓడగొట్టుకున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. యువతకు దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు దండుకుంటుంది బీజేపీ ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు. గ్రామ గ్రామానా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తున్నాం.. బీజేపీ పార్టీ ఏం చేస్తుంది మంత్రి ప్రశ్నించారు. తొమ్మిది సంవత్సరాల క్రితం 400 ఉన్న సిలిండర్ ధర బీజేపీ ప్రభుత్వం వచ్చాక 1200 రూపాయలకు చేసిందని ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ పార్టీకి ప్రజలే తగిన బుద్ది చెప్పాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ది ప్రజలకు తెలుసు.. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మితే మళ్లీ రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు.
Read Also: Griha Lakshmi Yojana: మహిళలకు గుడ్న్యూస్.. రక్షాబంధన్ కానుక ఇవ్వనున్న సిద్ధరామయ్య సర్కారు
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!