నీరా ఆరోగ్య ప్రదాయిని: మంత్రి శ్రీనివాస్ గౌడ్
తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా ఆరోగ్య ప్రదాయిని అని, ఇందులో పోషక విలువలు అధికంగా ఉన్నాయని, ఆబ్కారీ, పర్యాటక, శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ విషయం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ డా. భీమా నేతృత్వంలో జరిగిన పరిశోధనలోనూ తేలిందన్నారు. ఈ సందర్భంగా డా.భీమా తోటి శాస్ర్తవేత్తలు డా. చంద్రశేఖర్, డా. శ్రీనివాస నాయక్ లతో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ డా. భీమా నేతృత్వంలో వచ్చిన శాస్త్రవేత్తలతో చర్చించారు. డా. భీమా మైక్రోబయాలజీ రంగంలో గత 8ఏళ్ల నుంచి పరిశోధనలు చేసి పీహెచ్ డి సాధించారన్నారు. అమెరికాలో పీడీఎఫ్ ను పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గా నీరా పై పరిశోధన లు నిర్వహిస్తున్నారన్నారని మంత్రి తెలిపారు. ఈ పరిశోధనలో తాటి, ఈత చెట్ల నుండి సేకరించిన నీరా దీర్ఘకాలం పాటు సుమారు 6 నెలల పాటు నిల్వ ఉండే విధంగా ప్రాసేస్ చేసి నీరాను సహజ సిద్ధంగా ఉండేలా, నీరాలో ఉండే పోషక విలువలు, క్యాన్సర్ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయని శాస్ర్తవేత్తలు మంత్రికి వివరించారు.
Read Also: ఎన్నికల్లో గెలిస్తే ఉచిత విద్యుత్ ఇస్తాం: అఖిలేష్ యాదవ్
Also Read
- Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
- Kavitha: కవిత 'TRS' పార్టీ 5 భారీ హామీలు ఇవే.. విద్య, వైద్యం ఉచితం.. 4 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
కిడ్నీ స్టోన్ నివారణ కు సంబంధించిన ఓక్సలేట్ డికొర్ బాక్సిలేస్ ఎంజైమ్స్ (ఓడిఈ) సంవృద్ధిగా ఉండి కిడ్నిలో రాళ్ళు ఏర్పడకుండా ఉపయోగపడుతుందని అధ్యయనంలో తేలిందని మంత్రికి వివరించారు. తన పరిశోధన ద్వారా తెలియజెప్పటంతోపాటు, నీరాను దీర్ఘ కాలం పాటు నిల్వఉండేలా గత సంవత్సర కాలంగా పరిశోధనలు చేసి మెరుగైన ఫలితాలు సాధించిన డా. భీమాను ఆయన బృందాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో గీత వృత్తిదారుల సంక్షేమం, గీత వృత్తి ప్రోత్సాహం ను అందించాలనే లక్ష్యం తో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దీన్లో భాగంగా 20 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ లోని నెక్లస్ రోడ్డులో నీరా కేఫ్ ఏర్పాటుకు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!