నీరా ఆరోగ్య ప్రదాయిని: మంత్రి శ్రీనివాస్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా ఆరోగ్య ప్రదాయిని అని, ఇందులో పోషక విలువలు అధికంగా ఉన్నాయని, ఆబ్కారీ, పర్యాటక, శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ విషయం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ డా. భీమా నేతృత్వంలో జరిగిన పరిశోధనలోనూ తేలిందన్నారు. ఈ సందర్భంగా డా.భీమా తోటి శాస్ర్తవేత్తలు డా. చంద్రశేఖర్, డా. శ్రీనివాస నాయక్ లతో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ డా. భీమా నేతృత్వంలో వచ్చిన శాస్త్రవేత్తలతో చర్చించారు. డా. భీమా మైక్రోబయాలజీ రంగంలో గత 8ఏళ్ల నుంచి పరిశోధనలు చేసి పీహెచ్ డి సాధించారన్నారు. అమెరికాలో పీడీఎఫ్ ను పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గా నీరా పై పరిశోధన లు నిర్వహిస్తున్నారన్నారని మంత్రి తెలిపారు. ఈ పరిశోధనలో తాటి, ఈత చెట్ల నుండి సేకరించిన నీరా దీర్ఘకాలం పాటు సుమారు 6 నెలల పాటు నిల్వ ఉండే విధంగా ప్రాసేస్ చేసి నీరాను సహజ సిద్ధంగా ఉండేలా, నీరాలో ఉండే పోషక విలువలు, క్యాన్సర్ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయని శాస్ర్తవేత్తలు మంత్రికి వివరించారు.
Read Also: ఎన్నికల్లో గెలిస్తే ఉచిత విద్యుత్ ఇస్తాం: అఖిలేష్ యాదవ్
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
కిడ్నీ స్టోన్ నివారణ కు సంబంధించిన ఓక్సలేట్ డికొర్ బాక్సిలేస్ ఎంజైమ్స్ (ఓడిఈ) సంవృద్ధిగా ఉండి కిడ్నిలో రాళ్ళు ఏర్పడకుండా ఉపయోగపడుతుందని అధ్యయనంలో తేలిందని మంత్రికి వివరించారు. తన పరిశోధన ద్వారా తెలియజెప్పటంతోపాటు, నీరాను దీర్ఘ కాలం పాటు నిల్వఉండేలా గత సంవత్సర కాలంగా పరిశోధనలు చేసి మెరుగైన ఫలితాలు సాధించిన డా. భీమాను ఆయన బృందాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో గీత వృత్తిదారుల సంక్షేమం, గీత వృత్తి ప్రోత్సాహం ను అందించాలనే లక్ష్యం తో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దీన్లో భాగంగా 20 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ లోని నెక్లస్ రోడ్డులో నీరా కేఫ్ ఏర్పాటుకు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..