Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Seethakka Facial Recognition Pension Distribution Ts

Minister Seethakka : ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అర్హులకే పెన్షన్

Published Date :July 24, 2025 , 6:12 pm
By Gogikar Sai Krishna
  • పెన్షన్ల పంపిణీలో ఫేషియల్ రికగ్నిషన్ కీలకం
  • నిజమైన లబ్ధిదారులకే పథకాల లాభాలు చేరేలా చర్యలు
  • మహిళా సంక్షేమానికి వడ్డీ లేని రుణాలు, క్యాంటీన్లు, భీమా పథకాలు
  • ‘చేయూత’ పెన్షన్ ప్రభుత్వ సామాజిక బాధ్యత: మంత్రి సీతక్క
Minister Seethakka : ఫేషియల్ రికగ్నిషన్  ద్వారా అర్హులకే పెన్షన్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలని రాష్ట్ర మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రజా భవన్‌లో చేయూత పెన్షన్ల పంపిణీపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి సెర్ప్ (SERP) సీఈవో దివ్యా దేవరాజన్, డైరెక్టర్ గోపి, జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్లు హాజరయ్యారు.

పెన్షన్ల పంపిణీలో నూతన టెక్నాలజీని తప్పనిసరిగా అందిపుచ్చుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సులువుగా పెన్షన్ అందేలా సాంకేతికతను ఉపయోగించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా, ఫేషియల్ రికగ్నిషన్ (facial recognition) ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెన్షన్లు అందించడం ప్రభుత్వ సామాజిక బాధ్యత అని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రతి నెలా వెయ్యి కోట్ల రూపాయల పెన్షన్‌ను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

Also Read

  • Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
  • SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
  • Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
  • CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
Add as a preferred
source on google

IND vs ENG: తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 358 ఆలౌట్‌.. గాయంతోనే హాఫ్ సెంచరీ చేసిన రిషబ్‌ పంత్‌

“నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ చేరే విధంగా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలి,” అని సీతక్క స్పష్టం చేశారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటే నిజమైన పేదవారికి అన్యాయం చేసినట్లు అవుతుందని హెచ్చరించారు. సాంకేతిక కారణాలతో పెన్షన్ పంపిణీ ఆలస్యమైతే, ముందే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడమేకాకుండా, ఇందిరా మహిళా క్యాంటీన్లు, ప్రమాద భీమా ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి తెలిపారు. 15 సంవత్సరాల వయస్సు నుంచే మహిళలను మహిళా సంఘాలలో సభ్యులుగా చేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. “మహిళ ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బాగుపడుతుంది,” అని ఆమె అన్నారు.
ఆర్టీసీలో 200 కోట్ల మహిళా ప్రయాణాలు జరిగాయంటే మహిళలకు ‘ఫ్రీ బస్సు’ పథకం ఎంతగా ఉపయోగపడుతుందో అర్థమవుతుందని మంత్రి సీతక్క అన్నారు. “మహిళలు ఫ్రీ బస్సు ఎక్కడమే కాదు… మహిళలను బస్సు ఓనర్లను చేసింది మా ప్రభుత్వం,” అని వ్యాఖ్యానించారు.

పేదరికం తగ్గించకపోతే సమాజంలో అంతరాలు పెరుగుతాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. “పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షనే చేయూత… అదే వారి ధైర్యం,” అంటూ వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు.

Peddapuram: పెద్దాపురంలో చీకటి బాగోతం.. మహిళ ఆవేదన వింటే చలించిపోతారంతే..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Telangana Minister Seethakka Bats for Facial Recognition-Based Pension Distribution

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions