Sabita Indraredy: బీజేపీ పల్లెప్రగతిని రాంగ్ రూట్లో తీసుకెళ్లొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పంచాయతీలకు నిధులు, సర్పంచులకు పెండింగ్ బిల్లుల వ్యవహారంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. గ్రాామాల్ల పనులు చేసిన సర్పంచులకు బిల్లులు చెల్లిచడం లేదని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని.. అయినా సర్పంచులకు బిల్లులను దాదాపుగా క్లియర్ చేశామని, మిగతావి త్వరలోనే క్లియర్ చేస్తామని మంత్రులు చెబుతున్నారు.
ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్లవద్దని బీజేపీ పార్టీకి హితవు పలికారు. ప్రతి దాంట్లో మా వాటా ఉందని చెప్పే బీజేపీ అధ్యక్షుడు.. ఇప్పుడు గ్రామాలకు నిధులు ఇవ్వండంటూ అడగడం ఏంటని ప్రశ్నించారు. ద్వంద్వ నీతితో ఉన్న వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఈ నెల 3వ తేదీ నుంచి 15 రోజుల పాటు కొనసాగుతాయని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరికీ తెలసని ఆమె అన్నారు. దేశంలో అత్యుత్తమ సంసద్ గ్రామాలు 10 తెలంగాణలోనే ఉన్నాయని అన్నారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని అన్నారు.
రంగారెడ్డి జిల్లాల్లోని గ్రామ పంచాయతీలకు రూ.335 కోట్ల నిధులు విడుదల చేశామని.. ఇంకా రూ. 14 కోట్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు. మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జూన్ 3 నుంచి పల్లె ప్రగతిలో భాగంగా బడిబాట కూడా ఉంటుందని తెలిపారు. ఇంగ్లీషు మీడియం ఏర్పాటు చేయబోతున్నామని.. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని చెప్పారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!