Minister Ponnam Prabhakar: గిగ్ వర్కర్లకు రూ. 10 లక్షల ఆరోగ్య బీమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్లో గ్రౌండ్లో జరిగిన ఈ సమావేశానికి సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ‘గిగ్ వర్కర్స్ కోసం ఐదు లక్షల ఆక్సిడెంట్లు బీమా, 10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండు నెలల క్రితం స్విగ్గి డెలివరీ కోసం వెళ్లి కుక్క దాడి చేయడంతో బిల్డింగ్ పైనుంచి పడి ఒక వ్యక్తి చనిపోయాడు. బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రెండు లక్షలు చెల్లించనున్నాము. గీక్ వర్కర్స్ కోసం ఒక ఆప్ ఆధారిత సర్వీస్ను ప్రారంభించబోతున్నాం.
మొదటగా గిగ్ వర్కర్స్ కి ఒక కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ పథకాలు వాళ్లకు అప్లై చేస్తున్న. త్వరలో ఇతర అన్ని ఆటో యూనియన్ ప్రతినిధులను పిలిపించి వారి సమస్యలను తెలుసుకొని ఒక నెట్వర్క్ ఏర్పాటు చేస్తాము. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్స్ ఇబ్బంది పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆటో డ్రైవర్ను ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఖచ్చితంగా వారి సమస్యలను పరిష్కరిస్తాము. తెలంగాణలో ఉన్న ప్రతి కార్మికుడి సంరక్షణ మా బాధ్యత. వేరే పార్టీల వాళ్లు ఆటో యూనియన్ వాళ్ళను రెచ్చగొట్టి తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
అలాగే ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. 27 నవంబర్ న హైదరాబాద్ లో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక గిగ్ వర్కర్ల సమస్య లు తెలుసుకుంటా అన్నారు. అందులో భాగంగానే సీఎం , మంత్రుల కలిసి గిగ్ వర్కర్లు, మేనేజ్ మెంట్ తో సమావేశం అయ్యారు. గిగ్ వర్కర్లు వారి సమస్యలను నేరుగా సీఎం కు చెప్పుకున్నారు. గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా,10 లక్షల ఆరోగ్య భీమా లను కల్పిస్తాం. గిగ్ వర్కర్ల కోసం కొత్త బిల్లు తీసుకొస్తాం. దేశ వ్యాప్తంగా కోటి మందికి పైగా గిగ్ వర్కర్లు ఉన్నారు’ అని అన్నారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..