Minister KTR: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Suggested TRS Leaders To Not Speak Infront Of Media: మొయినాబాద్ ఫాంహౌస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిపిన బేరసారాల వ్యవహారంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుని సీబీఐకి బదిలీ చేయాలని, సిట్ని నియమించాలని డిమాండ్ చేసింది. అటు.. టీఆర్ఎస్ నేతలు సైతం విమర్శలు తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ట్విటర్ మాధ్యమంగా ఓ సూచన ఇచ్చారు. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉంది. కాబట్టి.. టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని ట్వీట్ చేశారు.
కాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన ఘటనలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే! ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారనే కూపీ లాగేందుకు.. ఆ ముగ్గురిని రహస్య ప్రాంతాల్లో ఉంచి, పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు నిన్న రాత్రి నుంచి ప్రగతి భవన్లోనే ఉన్నారు. వారితో పాటు కేటీఆర్, హరీశ్ రావు కూడా ప్రగతి భవన్లోనే ఉన్నారు. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారాన్ని ఎలా ఎండగట్టాలి, తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపై.. పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ మంతనాలు కూడా జరిపారు. ఈ క్రమంలో ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తారని, నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చి వివరాలు వెల్లడిస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ.. మీడియా సమావేశం నిర్వహించలేదు. ప్రాథమిక విచారణ కొనసాగుతోంది కాబట్టి, ఇప్పుడే మీడియా సమావేశం నిర్వహించడం సరైనది కాదనుకొని, వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది.
Also Read
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!