Minister KTR: ఆ గట్టున రాబందు మోడీ.. ఈ గట్టున రైతుబంధు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Speech In Naranapuram Road Show: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం నారాయణపురంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నిక రాజగోపాల్, ప్రభాకర్ రెడ్డి, స్రవంతి మధ్య పోటీ కాదని.. రెండు భావజాలాల మధ్య పోటీ అని పేర్కొన్నారు. ఆ గట్టున రాబందు మోడీ ఉంటే, ఈ గట్టున రైతుబంధు కేసీఆర్ ఉన్నారని.. మునుగోడు ప్రజలు ఏ గట్టున ఉంటారో నిర్ణయించుకోవాలని సూచించారు. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే.. 14 నెలల్లోనే తాము మునుగోడును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, కాలేజీలు, పోడు భూముల సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తనదేనన్నారు.
మందు, మటన్ పెట్టగానే గందరగోళానికి గురి కావొద్దని.. ఎవరి వల్ల మన బతుకులు బాగుపడుతాయో ఆలోచించుకోవాలని కేటీఆర్ కోరారు. మనది పేదల ప్రభుత్వమని.. బీజేపీది మాత్రం పెద్దల ప్రభుత్వమని విమర్శించారు. 18 వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్.. ఇంటింటికీ తులం బంగారం ఇచ్చినా ఇస్తాని, అలా ఇస్తే ఆ బంగారాన్ని తీసుకోవాలని, ఎందుకంటే అవన్నీ దొంగల పైసలని ఆరోపించారు. బీజేపీకి ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు. డబ్బుకో, మందుకో లొంగిపోయి బీజేపీకి ఓటు వేస్తే.. మన కంట్లో మనమే పొడుచుకున్నట్టు అవుతుందని తెలిపారు. ఆగం కాకుండా ఆలోచన చేయమన్న కేటీఆర్.. మునుగోడును సస్యశ్యామలం చేయబోతున్నామని, రాచకొండకి కూడా లిఫ్ట్లు పెట్టిస్తామని మాటిచ్చారు.
Also Read
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
సాధారణంగా ఎమ్మెల్యేలు పైకి పోతే ఉప ఎన్నిక వస్తుందని.. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోవడం వల్ల ఉప ఎన్నిక వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. 18 వేల కాంట్రాక్ట్కు మునుగోడు ఆత్మగౌరవాన్ని రాజగోపాల్ తాకట్టు పెట్టారని, నాలుగేళ్లలో ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించారు. అటు కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక ఒక్క మంచి పని కూడా చేయలేదని, మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక సిలిండర్ ధర రూ. 1200లకు, పెట్రోల్ ధర రూ. 110 పెరిగిందని పేర్కొన్నారు. పలివెలలో బీజేపీ గుండాలు దాడులు చేశారని, ఓడిపోయేటోడే ఇలా చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు పోలిన గుర్తులను కొందరు దొంగలు తీసుకొచ్చారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Chandrababu: ‘అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్’.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
-
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
-
Oppo Reno 16, Reno 16c: ఒప్పో రెనో 16, రెనో 16సి భారత్ లో విడుదల.. ఏఐ ఫీచర్లు, 7000mAh బ్యాటరీ
-
Tollywood: టాలీవుడ్’కి మరో షాకింగ్ విలన్ దిగుతున్నాడు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?