Harish Rao: ఆ కుటుంబం నుండి నేను చాలా నేర్చుకున్న..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో మాజీ రాజ్యసభ సభ్యుడు వొడితేల రాజేశ్వర్ రావు విగ్రహాన్ని ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. అనంతం హరీష్ రావు మాట్లాడుతూ.. రాజేశ్వర్ రావు విగ్రహం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 2001 తరువాత నాకు రాజేశ్వర్ రావుతో సానిహిత్యం పెరిగిందని అన్నారు. రాజేశ్వర్ రావు బ్రతికి ఉంటే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని చూసి సంతోషపడేవారని తెలిపారు. రాజేశ్వర్ రావు వ్రాసే సాహిత్యాలు,వ్యాసాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి చాలా దోహదపడ్డాయని అన్నారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎదిగిన వ్యక్తి రాజేశ్వర్ రావు, ఉరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న మహనీయుడు అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేసిన వ్యక్తి రాజేశ్వర్ రావు అని తెలిపారు. ఆ రోజుల్లో నక్సలైట్లు అంటే భయపడేవారు రాజకీయ నాయకులు కానీ నక్సలైట్లు కూడా ఇష్టపడే వ్యక్తి రాజేశ్వర్ రావు అని అన్నారు. ఆ కుటుంబం నుండి నేను కూడా చాలా నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా ఎంత ఎదిగిన తన స్వగ్రామం మాత్రం మర్చిపోనీ వ్యక్తి రాజేశ్వర్ రావు అని మంత్రి హరీష్ రావు అన్నారు.
Read also: Hollywood: రెండు వారాల్లో మూడు హిట్స్… థియేటర్స్ కళకళలాడుతున్నాయి
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. చెత్త వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నడక, చెత్త సేకరణ ద్వారా ఆరోగ్యంతో స్వచ్ఛ్ టౌన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘మా చెత్త మనదే’ అంటూ సిద్దిపేటలో ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 18వ వార్డులో నడుచుకుంటూ వెళ్తూ మురికి కాల్వలో పేరుకుపోయిన పేపర్లు, కవర్లను స్వయంగా తొలగించారు. చెత్తాచెదారం పేరుకుపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుందని అంటున్నారు. ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిన్న ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా కోకాపేటలోని తన నివాసం పరిసరాలను శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా లేకున్నా నీరు చేరి దోమలు వ్యాపించే అవకాశం ఉందన్నారు. దోమల వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ దోమల నివారణకు కృషి చేయాలని సూచించారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!