Milk Gang Arrest: మేడ్చల్ అడ్డాగా కల్తీ పాల దందా.. ముఠా గుట్టు రట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Milk Gang Arrest: పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. కానీ, మనం తాగే పాలు నాణ్యత ముఖ్యం. కల్తీ పాలు మూత్రపిండాల సమస్యలు, జీర్ణ సమస్యలు, విరేచనాలకు దారితీస్తాయి. దీంతో అనారోగ్య సమస్యలకు గురువుతుంటారు. అయితే హైదరాబాద్ నగరంలో కేటుగాళ్లు ఈజీగా మనీ కోసం పాలను కల్తీ చేస్తున్నారు. తమ స్వలాభం కోసం ఓ ముఠా కల్తీ పాల రాకెట్ను ప్రారంభించింది. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు వెంటనే గ్రామంలో దాడులు నిర్వహించి నేరం సాగిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. సూత్రధారి పరారీలో ఉండగా, ముఠాలోని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు వేల లీటర్ల పాలతో పాటు టిన్నులు, పాల ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నారు.
Read also: Tandur Kandi Pappu: రైతుల పంట పండింది.. కందులకు రికార్డు ధర..!
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
మేడ్చల్కు చెందిన శేఖర్ అనే వ్యక్తి మేడ్చల్లో స్వీట్ షాప్ వ్యాపారం చేస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న శేఖర్ ముగ్గురు ఆటో డ్రైవర్లు, మిల్క్ ట్యాంకర్ డ్రైవర్తో కలిసి నకిలీ పాల రాకెట్ను ప్రారంభించాడు. ఈ క్రమంలో కర్నూలు నుంచి శంషాబాద్ మీదుగా నాగ్ పూర్ వెళ్లే పాల ట్యాంకర్ నుంచి పాలను తీసుకెళ్లి అందులో నీళ్లు పోస్తున్నారు. తొమ్మిది వేల లీటర్ల పాలను తీసుకెళ్తున్న మిల్క్ ట్యాంకర్ నుంచి నలుగురు నిందితులు 3000 లీటర్ల పాలను తీసి, పాల ట్యాంకర్లోని పాలను నీటిలో కల్తీ చేశారు. ఈ ముఠా 40 లీటర్ల 83 పాల టిన్నులను తీసుకొచ్చి పాలను దొంగిలిస్తుంది. విశ్వసనీయ సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ముఠాపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో శేఖర్ నియమించిన ముగ్గురు ఆటో డ్రైవర్లు చాందిలాల్, చేతన్, సచిన్తో పాటు వారికి సహకరించిన పాల ట్యాంకర్ డ్రైవర్ వెంకన్నను శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి శేఖర్ పరారీలో ఉన్నాడు. అరెస్టు చేసిన వారి నుంచి 3000 లీటర్ల పాలతో పాటు డబ్బాలు, పాల ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
CM YS Jagan: చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు ఇది.. ఇక నుంచి సామాజిక అమరావతి
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!