Harish Rao: ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. 18 వార్డులో నడుస్తూ చెత్త తొలగిద్దాం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. వార్డులో ఉన్న చెత్తను స్వయంగా తొలగిస్తూ అవగాహన కల్పించారు. చెత్త పేరుకుపోవడం వలన అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. ఇంటిని, ఇంటి ఆవరణ వాతావరణాన్ని శుభ్రాంగా ఉంచుకోవాలని సూచించారు. 18 వార్డులో నడుస్తూ అక్కడే ఉన్న ఓ కాలువలో చెత్త పేరుకుపోవడంతో అందులో వున్న కవర్లు, పేపర్లు, ప్లాస్టిక్ బాటిల్లను స్వయంగా తన చేత్తో బయటకు తీశారు.
నిన్న జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10 నిమిషాల దోమల నివారణ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. కోకాపేటలోని తన నివాసంలో మంత్రి హరీశ్ 10 నిమిషాల పాటు ఇంటి చుట్టూ నిల్వ ఉన్న నీరు, చెత్తను దోమల నివారణకు స్వయంగా శుభ్రం చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం, ఆరోగ్యవంతమైన కుటుంబం సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు గడిపి కుటుంబ సమేతంగా ఇంటి పరిసరాలను, నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకుంటే నీరు చేరి దోమలు వ్యాపించే అవకాశం ఉందన్నారు. దోమల వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ దోమల నివారణకు కృషి చేయాలని మంత్రి సూచించారు.
Also Read
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
పూల కుండీలు, కొబ్బరి చిప్పలు వంటి చోట్ల నిలిచిన నీటిలో దోమల లార్వాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి పిలుపునిచ్చారు. ఆరోగ్యం విషయంలో ‘చికిత్స కంటే ముందుజాగ్రత్త మేలు’ అని అందరూ గుర్తుంచుకోవాలి. వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణంతో పాటు పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం ద్వారా వీలైనంత ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ, గ్రామ పంచాయతీల సిబ్బంది వీధులను శుభ్రం చేస్తున్నారని.. మన ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. వర్షాకాలం కావడంతో ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సన్నద్ధమైందని, ప్రభుత్వాసుపత్రుల్లో టీ డయాగ్నస్టిక్స్ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రిలో మందులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రజలు అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని మంత్రి హరీశ్రావు సూచించారు.
Housing Sales: ప్రధాన నగరాల్లో పడిపోయిన చిన్న ఇళ్ల విక్రయాలు.. హైదరాబాద్లో మరీ దారుణం..!
తాజావార్తలు
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
-
AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
-
సూపర్ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్లో బిగ్ అప్గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
-
Apple Watch Ultra 4 లాంచ్.. ఆరోగ్యానికి రక్షణ కవచం.. ప్రతి 5 సెకన్లకు హార్ట్రేట్ మానిటరింగ్.. బిగ్ బ్యాటరీ లైఫ్
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!