Site icon NTV Telugu

Harish rao: బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్

Harish Rao, Bandi Sanjay

Harish Rao, Bandi Sanjay

Harish rao: బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. గుజరాత్ లో ఎందుకు ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎకరాకు 10 వేల నష్ట పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్, రైతు బిడ్డ అని మరోసారి నిరూపించారని ట్వీట్ చేశారు. రైతుల గురించి, వ్యవసాయం గురించి బిజెపి నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లే అని విమర్శించారు. తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలని అడుగుతున్న బండి సంజయ్.. ముందు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలవా..? అంటూ ప్రశ్నించారు. దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని, పార్లమెంట్ సాక్షిగా బీజేపీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. దీనిని బట్టి చూస్తే ఆ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదని అర్థం కావడం లేదా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపంచారు.

CAG Report: కాగ్ నివేదిక… ఎన్నివేల కోట్లు మురిగిపోయాయంటే?

పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ. 10 వేలు సాయం చొప్పున, రూ. 228 కోట్లు ప్రకటించి రైతు బిడ్డనని మరోసారి నిరూపించుకున్నారని తెలిపారు. బిజెపి నేతలకు ఇది చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరమని అన్నారు. దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్టు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, నేడు ఆదాని ఆదాయాన్ని డబుల్ చేశారని మండిపడ్డారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ, నల్ల చట్టాలు తెచ్చి రైతులను బలి చేసిన చరిత్ర మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత మాది. సాగు, రైతు సంక్షేమం గురించి బిజెపి నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమే అంటూ మంత్రి హరీశ్ రావు, బండి సంజయ్ పై మండిపడ్డారు.
MLC Kavitha: మహిళా బిల్లును తీసుకురావాలి.. కవిత ట్వీట్‌ వైరల్‌

Exit mobile version