Harish rao: తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఢిల్లీ ఇబ్బంది పెడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలోని రెడ్డి భవన్ లో గీత కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేకనే కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆయన అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రూ. 4 వేల కోట్లు జీఎస్టీ కింద రావాలని.. 15 వ ఆర్థిక సంఘం రూ. 6 కోట్లు ఇవ్వాలని .. 14 వ ఆర్థిక సంఘం కింద రూ. 1300 కోట్లు రావాలని ఆయన తెలిపారు. పీఆర్జీఎఫ్ నుంచి రూ. 1900 కోట్లు రావాలి.. ఇవన్నీ కావాలనే ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేంద్ర, నరేంద్రమోదీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు. ఇటీవల హైదరాబాద్ టూర్ కు వచ్చిన మోదీ, టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. కుటుంబ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ మంత్రులు, ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు సీఎం కేసీఆర్, ప్రధాని మోదీకి స్వాగతం చెప్పకపోవడంపై ఫైర్ అవుతున్నారు. మోదీ అంటే భయపడే కేసీఆర్ బెంగళూర్ వెళ్లారని విమర్శిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో పీఎం మోదీకి 8 ప్రశ్నలు సంధిస్తూ నిలదీశారు.
Also Read
- CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
- Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
- Shabad Six Murder Case : షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు
ఇదిలా ఉంటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. 2023లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటీవల వరసగా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలు తెలంగాణలో పర్యటించారు. దీనిని బట్టి తెలుస్తోంది బీజేపీ తెలంగాణకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అని. ఇదిలా ఉంటే తెలంగాణకు చెందిన కే. లక్ష్మణ్ కు యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ. దీన్ని బట్టి పార్టీలో పని చేస్తే పదవులు వస్తాయనే సందేశాన్ని పంపించింది. దీంతో రానున్న రోజుల్లో పార్టీలో చేరిన వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామనే చెప్పకచెబుతోంది.
తాజావార్తలు
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్లో కింగ్ రైటింగ్!
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్కు తిప్పలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!