కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించాలి. వ్యవసాయ రంగంను వ్యాపార రంగంగా చూడకూడదు అని మంత్రి హరీష్ రావు అన్నారు. అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన హరీష్ రావు మాట్లాడుతూ… దేశానికి అన్నం పెడుతూ.. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగం. అటువంటి వ్యవసాయంను దండగ అనే స్థితి నుంచి కేసీఆర్ నేడు పండుగగా మార్చారు. పదేళ్ల క్రితం గంజీ కేంద్రాలను పెట్టిన ప్రాంతంలో… రైతుకు భీమా , ధీమా ను ఇచ్చి తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా కేసీఆర్ మార్చారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దారు అని తెలిపారు.
ఆసియా ఖండంలో పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను 3 ఏండ్ల లో మిషన్ మోడ్ లో పూర్తి చేశారు. రైతు బంధు మీద ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం 50 వేల కోట్ల రూపాయలును రైతులకు పంట పెట్టు బడి ఆర్థిక సహాయంగా అందించింది. డిసెంబర్ 28 నుంచి 7500 కోట్లు యాసంగి పంట కోసం రైతు బంధు సహాయం కింద అందజేస్తాం అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
