బ్యాంకర్లపై సర్కార్ సీరియస్.. రైతుబంధు సొమ్ము తిరిగి జమ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులకు పంట సాయం కోసం రైతు బంధు పథకం కింద ప్రభుత్వం వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తుంటే.. ఇదే అదునుగా పాత బకాయిలను వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాయి కొన్ని బ్యాంకులు.. దీంతో.. ప్రభుత్వం సాయం చేసినా.. రైతులు పంటపెట్టుబడి పెట్టలేని పరిస్థితి.. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో.. ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.. బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు.. ఇక, సీఎం ఆదేశాలతో ఆర్థిక మంత్రి హరీష్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇవాళ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.. ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల క్రింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. కానీ, రైతుబంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లుకు స్పష్టం చేవారు. భవిష్యత్తులో రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మంత్రి హరీష్రావు.
also read : తెలంగాణ మంత్రి వ్యాఖ్యలకు రోజా కౌంటర్
Also Read
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
ఇక, ఇప్పటికే రైతు బంధు సొమ్మును నిలిపివేసిన లేదా సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు మంత్రి హరీష్రావు.. ఈ అంశంపై బ్యాంకర్లు తమ తమ బ్యాంకు బ్రాంచీలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షించుటకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి టీం మానిటరింగ్ చేస్తుందని తెలిపారు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు 18002001001 మరియు 04033671300 ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఆదే విధంగా పంట రుణాల రెన్యూవల్, పంపిణీని బ్యాంకర్లు వేగవంతం చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు.
తాజావార్తలు
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!