బ్యాంకర్లపై సర్కార్ సీరియస్.. రైతుబంధు సొమ్ము తిరిగి జమ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులకు పంట సాయం కోసం రైతు బంధు పథకం కింద ప్రభుత్వం వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తుంటే.. ఇదే అదునుగా పాత బకాయిలను వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాయి కొన్ని బ్యాంకులు.. దీంతో.. ప్రభుత్వం సాయం చేసినా.. రైతులు పంటపెట్టుబడి పెట్టలేని పరిస్థితి.. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో.. ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.. బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు.. ఇక, సీఎం ఆదేశాలతో ఆర్థిక మంత్రి హరీష్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇవాళ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.. ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల క్రింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. కానీ, రైతుబంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లుకు స్పష్టం చేవారు. భవిష్యత్తులో రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మంత్రి హరీష్రావు.
also read : తెలంగాణ మంత్రి వ్యాఖ్యలకు రోజా కౌంటర్
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
ఇక, ఇప్పటికే రైతు బంధు సొమ్మును నిలిపివేసిన లేదా సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు మంత్రి హరీష్రావు.. ఈ అంశంపై బ్యాంకర్లు తమ తమ బ్యాంకు బ్రాంచీలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షించుటకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి టీం మానిటరింగ్ చేస్తుందని తెలిపారు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు 18002001001 మరియు 04033671300 ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఆదే విధంగా పంట రుణాల రెన్యూవల్, పంపిణీని బ్యాంకర్లు వేగవంతం చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!