Harish Rao: తెలంగాణ పథకాల్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టట్లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao Again Attacks On BJP Policies: తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నేళ్ల పాలనలో బీజేపీ చేసింది ఏమన్నా ఉందంటే.. అది గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మాత్రమేనని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు కోతలు, వాతలు తప్ప.. ఇచ్చిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని కేంద్రం ప్రభుత్వం కాపీ కొడుతోందని.. అది నిజం కాదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలనలో.. కాలంతో పని లేకుండా రెండు పంటలు పండే విధంగా ప్రాజెక్టుల్ని నిర్మించుకున్నామన్నారు. బోరు బావుల వద్ద మీటర్లు పెట్టలేదు కాబట్టే.. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ. 12 వేల కోట్లను కేంద్రం ఆపిందని మండిపడ్డారు. మీటర్ల మాట నిజం కాకపోతే.. రూ. 12 వేల కోట్లు ఎందుకు ఆపారు? ఇందుకు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
పంటకు ఐదు వేలు అందించి, రైతులకు పెట్టుబడి సహాయం చేసిన ఘనత టీఆర్ఎస్ది కాదా? అని నిలదీశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో.. తెలంగాణ తరహా రైతు బంధు ఇస్తున్నారా? దమ్ముంటే చెప్పండని ప్రశ్నించారు. అబద్ధాలను కూడా బీజేపీ నాయకులు అందంగా చెప్తారని విమర్శించారు. జై జవాన్-జై కిసాన్ అనే నానుడి లేకుండా.. ఓ వైపు రైతులకు గోస పెడుతూ, మరోవైపు అగ్నిపథ్తో దేశ యువతను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రైతుభీమా కింద రూ.5 లక్షల సహాయం అందించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని, ఇప్పటివరకూ 87 వేల మంది రైతు కుటుంబాలకు రూ.4333 కోట్ల సాయాన్ని అందించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ లేదని.. ఒక్క తెలంగాణలో మాత్రమే అమలు అవుతోందని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 54 వేల మందికి నెలనెలా ఆసరా పింఛన్లను కూడా అందిస్తున్నామని వెల్లడించారు.
Also Read
- Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
- KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
- Peddi Sudarshan Reddy: కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమ నాయకుడు.. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..
- Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు.. చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన ఆత్మ కమిటీ చైర్మన్, దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన హరీష్ రావు.. పై విధంగా వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కష్టాల్లో ఉందని, దేశ ప్రజల సంక్షేమం కోసం దేశ పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారని చెప్పారు. సీఎం కేసీఆర్, హరీశ్ రావు నేతృత్వంలో నిధుల కొరత లేకుండా దుబ్బాక నియోజకవర్గం అన్నీ రంగాలలో అభివృద్ధి చెందుతోందన్నారు.
తాజావార్తలు
-
World Cup 2027: వరల్డ్ కప్లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!
-
PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
-
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
-
Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
-
TVS Raider Doctor Doom Edition: మార్వెల్ డాక్టర్ డూమ్ స్ఫూర్తితో టీవీఎస్ కొత్త బైక్.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!