Gangula Kamalakar: గంగుల నివాసంలో రెండోరోజు ఈడీ సోదాలు.. విచారణకు సహకరిస్తానన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో రెండోరోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అక్రమ మైనింగ్, మనీలాండరింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రికి సంబంధించిన ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టారు. దీంతో.. దుబాయ్ లో కుటుంబంతో ఉన్న గంగుల కమలాకర్ నిన్న అర్థరాత్రి హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఈడీ విచారణ సంస్థ అధికారులకు సహకరిస్తానని చెప్పారు. 30 ఏళ్లకు పైగా తాను, తన బంధువులు గ్రానైట్ వ్యాపారంలో ఉన్నామని.. నిబంధనల ప్రకారమే వ్యాపారం చేస్తూ వస్తున్నామని స్పష్టం చేశారు. తాము ఇప్పటివరకూ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలిపారు. నేను ఎల్లప్పుడూ చట్ట పరిధిలో పనిచేశాను. చట్టానికి ఎవరూ అతీతం కాదు. నేను సహకరిస్తాను అందుకే నేను దుబాయ్కి వెళ్లి 12 గంటల్లో తిరిగి వచ్చాను” అని అతను చెప్పారు. తనపై, తన వ్యాపారాలపై ఈడీ, ఐటీకి చాలామంది ఫిర్యాదులు చేశారని.. ఈ నేపథ్యంలోనే ఈ సోదాలు జరిగాయని చెప్పారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాలనే ఉద్దేశ్యంతోనే తాను దుబాయ్ వెళ్లిన 16 గంటల్లోనే తిరిగొచ్చానని పేర్కొన్నారు. నన్ను విచారణ కోసం హైదరాబాద్ రావాలని నిలిచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాళ్ళు విచారణ కోసం పిలిస్తే వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని, దర్యాప్తు సంస్థల అధికారులకు అందుబాటులో ఉండి వారికి కావలసిన సమాచారం ఇవ్వాలని విదేశాల పర్యటనలో ఉన్న నేను వచ్చానని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ సాధించిన విజయం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీ, ఐటీ దాడులు జరిపించారని అనుమానం వ్యక్తం చేశారు.
Read also: Madhuri Dixit : అందరికీ వయసు పెరుగుతోంటే.. ఈమెకు తగ్గుతోంది..!
Also Read
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
కమలాకర్కి కరీంనగర్లో గ్రానైట్ సంస్థలు ఉన్నాయి. అతని “చట్టవిరుద్ధమైన” కార్యకలాపాల కారణంగా ఖజానాకు సుమారు ₹ 750 కోట్లు నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ 2012లో అతనిపై కేసు నమోదైంది. శ్వేత ఏజెన్సీస్, ఏఎస్ షిప్పింగ్, జెఎం, బ్యాక్సీ & కంపెనీ, మైథాలీ ఆధిత్య ట్రాన్స్పోర్టు, కేవీకే ఎనర్జీ, అరవిందా గ్రానైట్స్, సైండియా ఏజెన్సీస్, పీఎస్ఆర్ ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్లో సోదాలు నిర్వహించారు. 2011-13 మధ్య కాలంలో గ్రానైట్ అక్రమాలపై ఫిర్యాదులు, 2012లో గ్రానైట్ మైనింగ్ పై కేసు నమోదు చేసి, కేసు ఆధారంగా ఈడి విచారణ చేపట్టారు. గతేడాది నవంబర్లో ఆయనపై బీజేపీ నేతలు మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే.. కేంద్రంలోని అధికార పార్టీ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చి పార్టీ మారేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలతో కేసీఆర్ పార్టీ, బీజేపీ మధ్య కూడా వార్ నడుస్తోంది.అయితే దానిని బీజేపీ ఆరోపణను ఖండించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , కోర్టు పర్యవేక్షణలో ఉన్న ప్రత్యేక దర్యాప్తు బృందం వంటి “స్వతంత్ర సంస్థ” ద్వారా విచారణకు పిలుపునిచ్చింది. బీజేపీ అభ్యర్థనను విచారించిన తెలంగాణ హైకోర్టు, కేసీఆర్ పార్టీ ఆరోపణలను పరిశీలించేందుకు రాష్ట్ర పోలీసులను అనుమతించిన విషయం తెలిసిందే.
Gujarat Assembly elections: 160 మంది బీజేపీ తొలి జాబితా.. రవీంద్ర జడేజా భార్య, హార్దిక్ పటేల్కు ఛాన్స్
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!