Gangula Kamalakar: గంగుల నివాసంలో రెండోరోజు ఈడీ సోదాలు.. విచారణకు సహకరిస్తానన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో రెండోరోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అక్రమ మైనింగ్, మనీలాండరింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రికి సంబంధించిన ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టారు. దీంతో.. దుబాయ్ లో కుటుంబంతో ఉన్న గంగుల కమలాకర్ నిన్న అర్థరాత్రి హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఈడీ విచారణ సంస్థ అధికారులకు సహకరిస్తానని చెప్పారు. 30 ఏళ్లకు పైగా తాను, తన బంధువులు గ్రానైట్ వ్యాపారంలో ఉన్నామని.. నిబంధనల ప్రకారమే వ్యాపారం చేస్తూ వస్తున్నామని స్పష్టం చేశారు. తాము ఇప్పటివరకూ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలిపారు. నేను ఎల్లప్పుడూ చట్ట పరిధిలో పనిచేశాను. చట్టానికి ఎవరూ అతీతం కాదు. నేను సహకరిస్తాను అందుకే నేను దుబాయ్కి వెళ్లి 12 గంటల్లో తిరిగి వచ్చాను” అని అతను చెప్పారు. తనపై, తన వ్యాపారాలపై ఈడీ, ఐటీకి చాలామంది ఫిర్యాదులు చేశారని.. ఈ నేపథ్యంలోనే ఈ సోదాలు జరిగాయని చెప్పారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాలనే ఉద్దేశ్యంతోనే తాను దుబాయ్ వెళ్లిన 16 గంటల్లోనే తిరిగొచ్చానని పేర్కొన్నారు. నన్ను విచారణ కోసం హైదరాబాద్ రావాలని నిలిచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాళ్ళు విచారణ కోసం పిలిస్తే వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని, దర్యాప్తు సంస్థల అధికారులకు అందుబాటులో ఉండి వారికి కావలసిన సమాచారం ఇవ్వాలని విదేశాల పర్యటనలో ఉన్న నేను వచ్చానని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ సాధించిన విజయం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీ, ఐటీ దాడులు జరిపించారని అనుమానం వ్యక్తం చేశారు.
Read also: Madhuri Dixit : అందరికీ వయసు పెరుగుతోంటే.. ఈమెకు తగ్గుతోంది..!
Also Read
కమలాకర్కి కరీంనగర్లో గ్రానైట్ సంస్థలు ఉన్నాయి. అతని “చట్టవిరుద్ధమైన” కార్యకలాపాల కారణంగా ఖజానాకు సుమారు ₹ 750 కోట్లు నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ 2012లో అతనిపై కేసు నమోదైంది. శ్వేత ఏజెన్సీస్, ఏఎస్ షిప్పింగ్, జెఎం, బ్యాక్సీ & కంపెనీ, మైథాలీ ఆధిత్య ట్రాన్స్పోర్టు, కేవీకే ఎనర్జీ, అరవిందా గ్రానైట్స్, సైండియా ఏజెన్సీస్, పీఎస్ఆర్ ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్లో సోదాలు నిర్వహించారు. 2011-13 మధ్య కాలంలో గ్రానైట్ అక్రమాలపై ఫిర్యాదులు, 2012లో గ్రానైట్ మైనింగ్ పై కేసు నమోదు చేసి, కేసు ఆధారంగా ఈడి విచారణ చేపట్టారు. గతేడాది నవంబర్లో ఆయనపై బీజేపీ నేతలు మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే.. కేంద్రంలోని అధికార పార్టీ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చి పార్టీ మారేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలతో కేసీఆర్ పార్టీ, బీజేపీ మధ్య కూడా వార్ నడుస్తోంది.అయితే దానిని బీజేపీ ఆరోపణను ఖండించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , కోర్టు పర్యవేక్షణలో ఉన్న ప్రత్యేక దర్యాప్తు బృందం వంటి “స్వతంత్ర సంస్థ” ద్వారా విచారణకు పిలుపునిచ్చింది. బీజేపీ అభ్యర్థనను విచారించిన తెలంగాణ హైకోర్టు, కేసీఆర్ పార్టీ ఆరోపణలను పరిశీలించేందుకు రాష్ట్ర పోలీసులను అనుమతించిన విషయం తెలిసిందే.
Gujarat Assembly elections: 160 మంది బీజేపీ తొలి జాబితా.. రవీంద్ర జడేజా భార్య, హార్దిక్ పటేల్కు ఛాన్స్
తాజావార్తలు
-
France: మ్యూజిక్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటనలు.. సిరంజిలు గుచ్చి యువతులపై అత్యాచారాలు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు!
-
AI: ఏఐ తీసుకొస్తున్న భారీ ముప్పు.. నెలల్లోనే అంతా స్మాష్..?
-
Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
-
Heavy Rains: తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు.. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!