రైతులను ఎవరు మోసం చేసిన ఉపేక్షించేది లేదు: మంత్రి ఎర్రబెల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకున్న మిర్చి రైతుల ఆందోళనలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షా నిర్వహించారు. హైద్రాబాద్ నుంచి జిల్లా కలెక్టర్ గోపి, మార్కెట్ చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మీ కుమార స్వామి, మార్కెట్ కార్యదర్శి, వరంగల్ ఛాంబర్ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. రైతులకు నష్టం జరుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అండగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని పిలుపునిచ్చారు. రైతులను ఎవరు మోసం చేసిన ఉపేక్షించేది లేదన్నారు. గతేడాది కన్నా ఈ సారి పంటలకు మంచి ధరలు ఉన్నాయని, చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల మిర్చి పంటల దిగుబడులు తగ్గాయన్నారు. రైతులు నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. . రైతులకు మద్దతు ధరలు వచ్చే విధంగా మార్కెట్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. గిట్టుబాటు ధరలు వచ్చిన రైతులు తమ సరుకులను విక్రయించుకుని, మిగతా రైతులు ఆందోళన చెందకుండా గిట్టుబాటు ధర వచ్చే వరకు మార్కెట్లోని శీతలగిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలని సూచించారు. గిడ్డంగుల్లో భద్రపర్చుకున్న ఉత్పత్తులపై వడ్డీలేని రుణం పొందవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు, మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రతిరోజు ధరలపై మానిటరింగ్ చేయాలన్నారు. రైతులకు అధిక ధరలు వచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కాగా ఉదయం జరిగిన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఆందోళనలు కలవరానికి గురి చేశాయి. మార్కెట్ అధికారులు పాలక వర్గం చర్చలు జరిపిన అనంతరం ఆందోళనలు సద్దు మనిగాయి.మిర్చి ధర నచ్చిన రైతులు అమ్ముకోవచ్చు. రేటు గిట్టుబాటు కాదనుకున్న రైతుల నుండి రేపు కొనుగోలు జరుపుతామన్న మార్కెట్ కార్యదర్శి రాహుల్ తెలిపారు. రేపు మిర్చి కొత్త రైతుల నుంచి కొనుగోలు ఉందని తేల్చి చెప్పిన మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. రేపు మార్కెట్ కు మిర్చి తీసుకు రావద్దన్న పాలక వర్గం రైతులను కోరింది.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!