రైతులను ఎవరు మోసం చేసిన ఉపేక్షించేది లేదు: మంత్రి ఎర్రబెల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకున్న మిర్చి రైతుల ఆందోళనలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షా నిర్వహించారు. హైద్రాబాద్ నుంచి జిల్లా కలెక్టర్ గోపి, మార్కెట్ చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మీ కుమార స్వామి, మార్కెట్ కార్యదర్శి, వరంగల్ ఛాంబర్ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. రైతులకు నష్టం జరుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అండగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని పిలుపునిచ్చారు. రైతులను ఎవరు మోసం చేసిన ఉపేక్షించేది లేదన్నారు. గతేడాది కన్నా ఈ సారి పంటలకు మంచి ధరలు ఉన్నాయని, చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల మిర్చి పంటల దిగుబడులు తగ్గాయన్నారు. రైతులు నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. . రైతులకు మద్దతు ధరలు వచ్చే విధంగా మార్కెట్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. గిట్టుబాటు ధరలు వచ్చిన రైతులు తమ సరుకులను విక్రయించుకుని, మిగతా రైతులు ఆందోళన చెందకుండా గిట్టుబాటు ధర వచ్చే వరకు మార్కెట్లోని శీతలగిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలని సూచించారు. గిడ్డంగుల్లో భద్రపర్చుకున్న ఉత్పత్తులపై వడ్డీలేని రుణం పొందవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు, మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రతిరోజు ధరలపై మానిటరింగ్ చేయాలన్నారు. రైతులకు అధిక ధరలు వచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కాగా ఉదయం జరిగిన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఆందోళనలు కలవరానికి గురి చేశాయి. మార్కెట్ అధికారులు పాలక వర్గం చర్చలు జరిపిన అనంతరం ఆందోళనలు సద్దు మనిగాయి.మిర్చి ధర నచ్చిన రైతులు అమ్ముకోవచ్చు. రేటు గిట్టుబాటు కాదనుకున్న రైతుల నుండి రేపు కొనుగోలు జరుపుతామన్న మార్కెట్ కార్యదర్శి రాహుల్ తెలిపారు. రేపు మిర్చి కొత్త రైతుల నుంచి కొనుగోలు ఉందని తేల్చి చెప్పిన మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. రేపు మార్కెట్ కు మిర్చి తీసుకు రావద్దన్న పాలక వర్గం రైతులను కోరింది.
Also Read
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?