రైతులను ఎవరు మోసం చేసిన ఉపేక్షించేది లేదు: మంత్రి ఎర్రబెల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకున్న మిర్చి రైతుల ఆందోళనలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షా నిర్వహించారు. హైద్రాబాద్ నుంచి జిల్లా కలెక్టర్ గోపి, మార్కెట్ చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మీ కుమార స్వామి, మార్కెట్ కార్యదర్శి, వరంగల్ ఛాంబర్ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. రైతులకు నష్టం జరుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అండగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని పిలుపునిచ్చారు. రైతులను ఎవరు మోసం చేసిన ఉపేక్షించేది లేదన్నారు. గతేడాది కన్నా ఈ సారి పంటలకు మంచి ధరలు ఉన్నాయని, చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల మిర్చి పంటల దిగుబడులు తగ్గాయన్నారు. రైతులు నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. . రైతులకు మద్దతు ధరలు వచ్చే విధంగా మార్కెట్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. గిట్టుబాటు ధరలు వచ్చిన రైతులు తమ సరుకులను విక్రయించుకుని, మిగతా రైతులు ఆందోళన చెందకుండా గిట్టుబాటు ధర వచ్చే వరకు మార్కెట్లోని శీతలగిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలని సూచించారు. గిడ్డంగుల్లో భద్రపర్చుకున్న ఉత్పత్తులపై వడ్డీలేని రుణం పొందవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు, మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రతిరోజు ధరలపై మానిటరింగ్ చేయాలన్నారు. రైతులకు అధిక ధరలు వచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కాగా ఉదయం జరిగిన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఆందోళనలు కలవరానికి గురి చేశాయి. మార్కెట్ అధికారులు పాలక వర్గం చర్చలు జరిపిన అనంతరం ఆందోళనలు సద్దు మనిగాయి.మిర్చి ధర నచ్చిన రైతులు అమ్ముకోవచ్చు. రేటు గిట్టుబాటు కాదనుకున్న రైతుల నుండి రేపు కొనుగోలు జరుపుతామన్న మార్కెట్ కార్యదర్శి రాహుల్ తెలిపారు. రేపు మిర్చి కొత్త రైతుల నుంచి కొనుగోలు ఉందని తేల్చి చెప్పిన మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. రేపు మార్కెట్ కు మిర్చి తీసుకు రావద్దన్న పాలక వర్గం రైతులను కోరింది.
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
తాజావార్తలు
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!