Price Hike : సామాన్యుడికి షాక్.. భారీగా పెరగనున్న మందులు, పెయింట్ల ధరలు
- యుద్ధ ప్రభావంతో మందుల ధరలు పెరుగుదల
- ముడి పదార్థాల కొరతతో ఔషధ రంగానికి షాక్
- పెయింట్ ధరల్లో 10% పెంపు ప్రకటన
- సామాన్యుడి బడ్జెట్పై భారీ భారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారతీయ సామాన్యుడి బడ్జెట్పై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం అంతర్జాతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా, మన దేశంలోని మందులు , పెయింట్ల ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. ముఖ్యంగా ఔషధ రంగంపై ఈ ప్రభావం అత్యంత ఆందోళనకరంగా ఉంది. మన దేశంలో తయారయ్యే అనేక మందులకు అవసరమైన ముడి పదార్థాలు (Raw Materials) పశ్చిమాసియా , చైనా దేశాల నుండి దిగుమతి అవుతాయి.
Botsa Satyanarayana: అమరావతిపై తీర్మానం చేసినంత మాత్రాన పర్మినెంట్ కాదు.. బొత్స సంచలనం
యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణాకు ఆటంకాలు ఏర్పడటం, కంటైనర్ల కొరత , రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఔషధ కంపెనీలు ధరల పెంపునకు సిద్ధమయ్యాయి. మనం నిత్యం వాడే పారాసిటమాల్ మొదలుకొని పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్, బీపీ , డయాబెటిస్ మందుల వరకు అన్నింటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఒక్క పారాసిటమాల్ తయారీ ఖర్చులే సుమారు 96% పెరిగాయని, దీనివల్ల ఓవరాల్గా మందుల ధరలు 20% నుండి 30% వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త స్టాక్ విషయంలో ఈ పెరిగిన ధరలను అమలు చేస్తున్నాయి, ఇది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపనుంది.
Also Read
Varanasi: క్లైమాక్స్కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్
మరోవైపు, సొంతింటి కల నెరవేర్చుకుని రంగులు అద్దుకోవాలనుకునే వారికి కూడా ఈ యుద్ధం షాక్ ఇస్తోంది. పెయింట్ల తయారీలో వాడే కీలకమైన ముడిసరుకు దిగుమతి నిలిచిపోవడంతో పెయింట్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ప్రముఖ సంస్థలైన ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీలు ఏప్రిల్ 10వ తేదీ నుండి సుమారు 10% ధరల పెంపును అమలు చేయబోతున్నాయి. ముడిసరుకు కొరత కారణంగా కేవలం ధరలు పెరగడమే కాకుండా, మార్కెట్లో కొన్ని రకాల కలర్స్ , బ్రాండ్ల లభ్యత కూడా తగ్గిపోయింది.
గతంలో ఆర్డర్ ఇచ్చిన 24 గంటల్లోనే వచ్చే డెలివరీ, ఇప్పుడు మూడు నుండి నాలుగు రోజులకు పైగా సమయం తీసుకుంటోంది. దీనివల్ల అటు వినియోగదారులు, ఇటు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం ఎక్కడో సుదూర ప్రాంతంలో జరుగుతున్నా, దాని ఆర్థిక పరిణామాలు మాత్రం మన వంటింటి బడ్జెట్ నుండి ఆరోగ్య బడ్జెట్ వరకు అన్నింటినీ అతలాకుతలం చేస్తున్నాయి. రవాణా వ్యవస్థలు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ధరల భారం ఇలాగే కొనసాగే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!