Medak: ఈఎంఐ కట్టమంటే బైక్ కి నిప్పుపెట్టిన యువకుడు..
- మెదక్ జిల్లా శివంపేటలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు..
- యువకుడి ఇంటికి వచ్చి EMI కట్టాలని బెదిరించిన ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు..
- మనోవేదనకు గురైన యువకుడు ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల ముందే బైక్ కి నిప్పు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak: ప్రస్తుతం ఎలాంటి రుణాలు తీసుకున్నా ఈఎంఐ పద్ధతిలో చెల్లించేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగమూ పెరిగింది. దీంతో నెలవారీ వాయిదా పద్ధతి ఈఎంఐ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. ఇచ్చిన గడువులోపు ఈఎంఐ చెల్లిస్తే ఎలాంటి అదనపు భారం ఉండదు. కానీ, ఈఎంఐ చెల్లించడం ఆలస్యమైతే నరకం చూడాల్సిందే. లోన్ ఈఎంఐ గడువు ఒక్కరోజు ఆలస్యమైతే అనుకున్నదానికంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇది పలువురికి తెలియక ఈఎంఐ కట్టేందుకు ఒకరోజే కదా కట్టేద్దాం అనుకుంటారు. కానీ దానికి డబుల్ కట్టాల్సి వస్తుందని ఊహించరు. అయితే.. ఈఎంఐ కట్టలేదని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపులకు ఓ యువకుడు బైక్ తగలబెట్టిన ఘటన మెదక్ జిల్లా శివంపేటలో జరిగింది.
Read also: Suryapet: అన్నారం ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
Also Read
- Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివంపేటలో ఉంటున్న ఓ యువకుడు ఈఎంఐ ద్వారా ఓ బైక్ ను కొనుగోలు చేశాడు. అయితే ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటూ వచ్చాడు. కాగా.. ఈనెల కొన్ని కారణాల వల్ల బైక్ ఈఎంఐ కట్టలేక పోయాడు. దీంతో ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. తాను కడతానని కాస్త సమయం ఇవ్వాలని యువకుడు కోరాడు. అయితే ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు మాత్రం వినలేదు. బైక్ ఈఎంఐ చెల్లించాల్సిందే అని చివరకు ఆ యువకుడి ఇంటికి వచ్చారు. ఇంటి వద్ద బైక్ ఈఎంఐ కట్టాలని నానా రచ్చచేయడమే కాకుండా బెదిరించారు. దీంతో మనోవేదనకు గురైన యువకుడు ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల ముందే బైక్ కి నిప్పు పెట్టాడు. బైక్ పూర్తీగా దగ్దం అయ్యింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సమాచారంతో ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగింది అనేది ఆరా తీస్తున్నారు. యుకుడు, ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు ఇచ్చిన ఆధారాలతో ఫిర్యాదు నమోదు చేసినట్లు తెలిపారు.
KTR Comments: ఈనెల 29 తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజు..
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!