Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Farmer Couple Attempts Suicide In Annaram Suryapet District

Suryapet: అన్నారం ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం

Published Date :November 24, 2024 , 12:44 pm
By Bhanu
  • సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పెట్రోల్ పోసుకొని రైతు కుటుంబం ఆత్మహత్య యత్నం..
  • ధాన్యం బాగాలేదని వెనక్కి పంపిన మిల్లు యాజమాన్యం..
  • మనస్థాపంతో కొనుగోలు కేంద్రం వద్ద రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం..
  • అన్నారం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఘటన..
Suryapet: అన్నారం ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Suryapet: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈనేపథ్యంలో ఐకేపీ కేంద్రంలో నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు చేసి ఎగుమతి చేసిన ధాన్యాన్ని కోదాడ రైస్‌ మిల్లర్‌ దిగుమతి చేయకుండా ఐకేపీ కేంద్రానికి తిరిగి పంపారు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఎ రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో చోటుచేసుకుంది.

Read also: KTR Comments: ఈనెల 29 తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజు..

Also Read

  • Youth Arrested: చోరీలు చేస్తూ తెలంగాణలో పట్టుబడ్డ ఎపీకీ చెందిన యువకుడు
  • Viral Video: ఛీ.. ఛీ.. అయ్యప్ప మాల వేసుకొని ఈ గలీజు పనేంటి స్వామి..!
  • Uttam Kumar Reddy : దేవాదుల ప్యాకేజ్6పై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
  • Crime News: కుండలో బంగారు నాణేలు దొరికాయని.. రూ.20 లక్షలు టోకరా! చివరికి ఏమైందంటే?

బాధితుల వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం చౌళ్లతండాకు చెందిన గుగులోతు కీమా నాయక్, పున్నమ్మ దంపతులు అన్నారం గ్రామానికి చెందిన గోగుల రామకృష్ణకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. పండించిన ధాన్యాన్ని ఈనెల మొదటి వారంలో అన్నారం ఐకేపీ కేంద్రానికి పంపించారు. ఎండబెట్టి, తూర్పారబెట్టాక చేసిన తర్వాత వరిలో తేమ శాతం, నాణ్యతను ఏఈవో పరిశీలించి కొనుగోలుకు ఎంపిక చేశారు. ఈ నెల 16న కాంటా వేశారు. కీమాకు చెందిన 425 బస్తాలు, మరో ఇద్దరు రైతులకు చెందిన 263 బస్తాలు కలిపి మొత్తం 688 బస్తాలను ఈ నెల 17న లారీలో ఎగుమతి చేసి కోదాడలోని వెంకటరమణ రైస్ మిల్లుకు ఎగుమతి చేశారు. వరి ధాన్యం నల్లగా ఉందని, దించలేదని మిల్లు నిర్వాహకులు ఈ నెల 18న ఐకేపీ కేంద్రానికి సమాచారం అందించారు. రైతు కీమా, ఐకేపీ నిర్వాహకులు మిల్లుకు వెళ్లి అడగ్గా వడ్లు బాగోలేదని బస్తాకు మూడు కిలోలు తగ్గిస్తామని మిల్లు నిర్వాహకులు తెలిపారు.

Read also: Bhatti Vikramarka: సమగ్ర సర్వేలో డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైంది.. వీడియో కాన్ఫరెన్స్‌ లో భట్టి విక్రమార్క

రైతు కీమా అంగీకరించడానికి నిరాకరించాడు.. తరుగు తగ్గించకుండా దించమని వారిని వేడుకున్నాడు, కానీ మిల్లు మేనేజర్ అంగీకరించలేదు. తరుగుతీస్తే తాను ఒప్పుకునేది లేదని రైతు తిరిగి వచ్చాడు. మిల్లు నిర్వాహకులు శనివారం ఉదయం ధాన్యాన్ని దించకుండానే ఐకేపీ కేంద్రానికి తిరిగి పంపించారు. ధాన్యం లారీ తిరిగి వచ్చిందని ఐకేపీ నిర్వాహకులు చెప్పారు. దీంతో రైతు కీమా దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద లారీ వద్దకు రైతు కీమా దంపతులు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై పెట్రోలు పోసుకుంటున్న సమయంలో సెంటర్‌లోని తోటి రైతులు వారిని చూసి వారి చేతుల్లోని పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. దీంతో వారు స్థానిక తహసీల్దార్ దయానందంకు ఫిర్యాదు చేశారు. వెంటనే తహసీల్దార్ డీటీ కంట్లమయ్య, ఏఓ బాలకృష్ణ, ఏపీఎం రాంబాబు ఐకేపీ సెంటర్‌కు చేరుకున్నారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మిల్లు యాజమాన్యంతో మాట్లాడి నష్టపోకుండా తిరిగి మిల్లుకు దింపేందుకు పంపించారు. ఆ మిల్లుకు పంపిన ధాన్యానికి బస్తాకు కిలో చొప్పున కోత విధిస్తున్నట్లు చెబుతున్నారు.
Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Farmer couple attempts suicide
  • Farmer couple attempts suicide in Annaram
  • Suryapet District

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions