Suryapet: అన్నారం ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
- సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పెట్రోల్ పోసుకొని రైతు కుటుంబం ఆత్మహత్య యత్నం..
- ధాన్యం బాగాలేదని వెనక్కి పంపిన మిల్లు యాజమాన్యం..
- మనస్థాపంతో కొనుగోలు కేంద్రం వద్ద రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం..
- అన్నారం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryapet: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈనేపథ్యంలో ఐకేపీ కేంద్రంలో నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు చేసి ఎగుమతి చేసిన ధాన్యాన్ని కోదాడ రైస్ మిల్లర్ దిగుమతి చేయకుండా ఐకేపీ కేంద్రానికి తిరిగి పంపారు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఎ రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో చోటుచేసుకుంది.
Read also: KTR Comments: ఈనెల 29 తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజు..
Also Read
బాధితుల వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం చౌళ్లతండాకు చెందిన గుగులోతు కీమా నాయక్, పున్నమ్మ దంపతులు అన్నారం గ్రామానికి చెందిన గోగుల రామకృష్ణకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. పండించిన ధాన్యాన్ని ఈనెల మొదటి వారంలో అన్నారం ఐకేపీ కేంద్రానికి పంపించారు. ఎండబెట్టి, తూర్పారబెట్టాక చేసిన తర్వాత వరిలో తేమ శాతం, నాణ్యతను ఏఈవో పరిశీలించి కొనుగోలుకు ఎంపిక చేశారు. ఈ నెల 16న కాంటా వేశారు. కీమాకు చెందిన 425 బస్తాలు, మరో ఇద్దరు రైతులకు చెందిన 263 బస్తాలు కలిపి మొత్తం 688 బస్తాలను ఈ నెల 17న లారీలో ఎగుమతి చేసి కోదాడలోని వెంకటరమణ రైస్ మిల్లుకు ఎగుమతి చేశారు. వరి ధాన్యం నల్లగా ఉందని, దించలేదని మిల్లు నిర్వాహకులు ఈ నెల 18న ఐకేపీ కేంద్రానికి సమాచారం అందించారు. రైతు కీమా, ఐకేపీ నిర్వాహకులు మిల్లుకు వెళ్లి అడగ్గా వడ్లు బాగోలేదని బస్తాకు మూడు కిలోలు తగ్గిస్తామని మిల్లు నిర్వాహకులు తెలిపారు.
రైతు కీమా అంగీకరించడానికి నిరాకరించాడు.. తరుగు తగ్గించకుండా దించమని వారిని వేడుకున్నాడు, కానీ మిల్లు మేనేజర్ అంగీకరించలేదు. తరుగుతీస్తే తాను ఒప్పుకునేది లేదని రైతు తిరిగి వచ్చాడు. మిల్లు నిర్వాహకులు శనివారం ఉదయం ధాన్యాన్ని దించకుండానే ఐకేపీ కేంద్రానికి తిరిగి పంపించారు. ధాన్యం లారీ తిరిగి వచ్చిందని ఐకేపీ నిర్వాహకులు చెప్పారు. దీంతో రైతు కీమా దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద లారీ వద్దకు రైతు కీమా దంపతులు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై పెట్రోలు పోసుకుంటున్న సమయంలో సెంటర్లోని తోటి రైతులు వారిని చూసి వారి చేతుల్లోని పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. దీంతో వారు స్థానిక తహసీల్దార్ దయానందంకు ఫిర్యాదు చేశారు. వెంటనే తహసీల్దార్ డీటీ కంట్లమయ్య, ఏఓ బాలకృష్ణ, ఏపీఎం రాంబాబు ఐకేపీ సెంటర్కు చేరుకున్నారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మిల్లు యాజమాన్యంతో మాట్లాడి నష్టపోకుండా తిరిగి మిల్లుకు దింపేందుకు పంపించారు. ఆ మిల్లుకు పంపిన ధాన్యానికి బస్తాకు కిలో చొప్పున కోత విధిస్తున్నట్లు చెబుతున్నారు.
Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు..
తాజావార్తలు
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!