Medak : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆరు మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ
ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 18 మున్సిపాలిటీలు ఉండగా, ప్రధానంగా ఆరు కీలక పట్టణాల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్మన్ సీట్లను ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు ముమ్మరంగా వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థులను కాపాడుకునేందుకు , ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే రహస్య ప్రాంతాల్లో క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ఇంద్రేశం వంటి చోట్ల స్వతంత్రులు బీఆర్ఎస్లో చేరడంతో కొన్ని పీఠాలు ఖరారైనప్పటికీ, మిగిలిన చోట్ల మాత్రం రేపు జరగబోయే ఎన్నిక వరకు ఉత్కంఠ కొనసాగేలా ఉంది.
ఈ రాజకీయ చదరంగంలో బీజేపీ ఊహించని విధంగా ‘కింగ్ మేకర్’గా అవతరించింది. ముఖ్యంగా నర్సాపూర్ , జిన్నారం మున్సిపాలిటీల్లో బీజేపీ మద్దతు లేనిదే ఏ పార్టీ కూడా పీఠాన్ని దక్కించుకోలేని పరిస్థితి ఉంది. నర్సాపూర్లో కాంగ్రెస్కు ఆరు, బీఆర్ఎస్కు ఐదు, బీజేపీకి నాలుగు సీట్లు రాగా, బీజేపీ తమకు చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు ఇస్తామనే గట్టి ఆఫర్ను రెండు ప్రధాన పార్టీల ముందు ఉంచింది. జిన్నారంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో, ఇక్కడ చైర్మన్ పీఠం దక్కాలంటే బీజేపీ కౌన్సిలర్ల మద్దతు తీసుకోవడం కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలకు తప్పనిసరిగా మారింది. దీంతో కమలం పార్టీ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా మారి రెండు పార్టీలకు షాక్ ఇస్తోంది.
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
మరోవైపు జహీరాబాద్ , ఇస్నాపూర్లో రసవత్తర పోరు సాగుతోంది. జహీరాబాద్లో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలిచాయి, అయితే అక్కడ గెలిచిన ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ రెబెల్స్ కావడంతో వారిని తిరిగి బుజ్జగించే పనిలో హస్తం పార్టీ ఉంది. ఇస్నాపూర్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి, ఇక్కడ మెదక్ ఎంపీ రఘునందన్ రావు మద్దతు ఎవరికి ఉంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. జిన్నారంలో బీజేపీకి చైర్మన్ పదవి ఆఫర్ చేస్తే, ఇక్కడ వారు ఏ పార్టీకి ఓటు వేస్తారనేది మిస్టరీగా మారింది. ఇప్పటికే సంగారెడ్డి, సదాశివపేట వంటి చోట్ల కాంగ్రెస్ పట్టు సాధించగా, సిద్దిపేట పరిసరాల్లో బీఆర్ఎస్ తన పీఠాలను కాపాడుకుంది. రేపు (ఫిబ్రవరి 16న) జరగనున్న చైర్మన్ ఎన్నికలతో ఈ అనిశ్చితికి తెరపడనుంది.
Deputy CM Pawan: పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు పని చేయాలి..
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?