BJP Chief Ramchander Rao : అప్పుడు నేను కుడా నా పదవికి రాజీనామా చేస్తా
- ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి పునరుత్థానం అవసరం
- బీసీ సీఎం కోసం రేవంత్కు సవాల్ విసిరిన రామచందర్ రావు
- కేంద్ర బీజేపీ పాలన విజయాలు.. రిజర్వేషన్లపై స్పష్టత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Chief Ramchander Rao : ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి పునర్వైభవం తీసుకురావాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపునిచ్చారు. బీజేపీ కేవలం పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా బలంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇప్పటివరకు 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని, బీజేపీ ఒక్క పైసా ఇవ్వలేదన్న ఆరోపణలు కావాలని చేస్తున్నారని రామచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 మోసపు హామీలతో అధికారంలోకి వచ్చి, ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని రామచందర్ రావు ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉన్నా అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. ఇంతకుముందు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పటికీ, మెదక్ జిల్లాకు అన్యాయం జరిగిందని అన్నారు.
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రూ.351 పెంపు..
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
CM Chandrababu: 2004లో మేం అధికారం కోల్పోవడానికి కారణం ఇదే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, కొత్త రైల్వే స్టేషన్లు, కొత్త జాతీయ రహదారులు బీజేపీ వల్లే వచ్చాయని ఆయన గుర్తుచేశారు. బీజేపీ బీసీల పార్టీ అని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బీసీ వర్గానికి చెందినవారని తెలిపారు.
బీసీలపై చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ బీసీని ముఖ్యమంత్రిగా నియమించాలి, అలా చేస్తే తాను కూడా పదవికి రాజీనామా చేస్తానని రామచందర్ రావు సవాల్ విసిరారు. కేంద్ర క్యాబినెట్లో 20 మంది బీసీలు ఉన్నారని గుర్తు చేశారు. బీసీల రిజర్వేషన్లకు 42 శాతం మద్దతు ఇస్తామని, ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే బీజేపీ సహకరిస్తుందని స్పష్టం చేశారు.
బీసీల బిల్లులో 10 మంది ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. మతప్రాధాన్యత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని తెలిపారు. దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుందని, బీజేపీ అవినీతి రహిత పాలన సాగిస్తోందని రామచందర్ రావు అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పనిసరిగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!