BJP Chief Ramchander Rao : అప్పుడు నేను కుడా నా పదవికి రాజీనామా చేస్తా
- ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి పునరుత్థానం అవసరం
- బీసీ సీఎం కోసం రేవంత్కు సవాల్ విసిరిన రామచందర్ రావు
- కేంద్ర బీజేపీ పాలన విజయాలు.. రిజర్వేషన్లపై స్పష్టత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Chief Ramchander Rao : ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి పునర్వైభవం తీసుకురావాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపునిచ్చారు. బీజేపీ కేవలం పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా బలంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇప్పటివరకు 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని, బీజేపీ ఒక్క పైసా ఇవ్వలేదన్న ఆరోపణలు కావాలని చేస్తున్నారని రామచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 మోసపు హామీలతో అధికారంలోకి వచ్చి, ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని రామచందర్ రావు ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉన్నా అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. ఇంతకుముందు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పటికీ, మెదక్ జిల్లాకు అన్యాయం జరిగిందని అన్నారు.
Also Read
- PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
- Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్లో చీప్ లిక్కర్..
- TG Inter Admissions: పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
CM Chandrababu: 2004లో మేం అధికారం కోల్పోవడానికి కారణం ఇదే.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, కొత్త రైల్వే స్టేషన్లు, కొత్త జాతీయ రహదారులు బీజేపీ వల్లే వచ్చాయని ఆయన గుర్తుచేశారు. బీజేపీ బీసీల పార్టీ అని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బీసీ వర్గానికి చెందినవారని తెలిపారు.
బీసీలపై చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ బీసీని ముఖ్యమంత్రిగా నియమించాలి, అలా చేస్తే తాను కూడా పదవికి రాజీనామా చేస్తానని రామచందర్ రావు సవాల్ విసిరారు. కేంద్ర క్యాబినెట్లో 20 మంది బీసీలు ఉన్నారని గుర్తు చేశారు. బీసీల రిజర్వేషన్లకు 42 శాతం మద్దతు ఇస్తామని, ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే బీజేపీ సహకరిస్తుందని స్పష్టం చేశారు.
బీసీల బిల్లులో 10 మంది ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. మతప్రాధాన్యత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని తెలిపారు. దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుందని, బీజేపీ అవినీతి రహిత పాలన సాగిస్తోందని రామచందర్ రావు అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పనిసరిగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
-
Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
-
Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
-
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?