Gold medalist Turn As Thief: ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అలియాస్ దొంగ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతనో ఎంబీఏ పట్టభద్రుడు. ఉన్నత విద్యను అభ్యసించడమే కాదు గోల్డ్ మెడల్ సాధించాడు. కానీ తన వ్యసనాలను మానలేకపోయాడు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. గుంటూరుకు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ లోకేశ్ అలియాస్ సామ్ రిచర్డ్ నగరంలో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. క్యాబ్ డ్రైవర్గా వృత్తిని ఎంచుకుని.. ఇళ్లలో చోరీలు చేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. 200 వరకు దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకెళ్లొచ్చాడు. అయినా తీరు మార్చుకోలేదు. తాజాగా మరో కేసులో హైదరాబాద్లోని గాంధీనగర్ పోలీసులకు చిక్కాడు. గత నెలలో కవాడిగూడలోని ఓ ఇంట్లో దొంగతనం కేసులో వంశీకృష్ణను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 19 తులాల బంగారు నగలు, రూ.3 లక్షల నగదుతో పాటు రెండు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.
వంశీకృష్ణ 2004లో ఎంబీఏలో గోల్డ్మెడల్ సాధించాడు. ఆ తర్వాత జల్సాలకు అలవాటు పడ్డాడు. అందుకోసం సులభంగా డబ్బు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దొంగతనాలే మార్గమని నిర్ణయించుకున్నాడు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు మొదలుపెట్టాడు. హైదరాబాద్ నగరంతోపాటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ దొంగతనాలకు పాల్పడ్డాడు. 2006 నుంచి ఇప్పటివరకు 200 ఇళ్లలో దొంగతనాలు చేశాడని పోలీసులు తెలిపారు. వివిధ కేసుల్లో సుమారు 67 నెలల జైలుశిక్ష అనుభవించాడు. అతనిపై పోలీసులు రెండుసార్లు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు.
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
Chandrashekhar Guruji: శిష్యుడే గురూజీ హంతకుడు..? నిందితుడి భార్య గతంలో..
సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత కొన్నాళ్లుగా ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. ఈ విధంగా 38 కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెట్టారు. వలవేసి ఓ కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 800 గ్రాముల బంగారం, లక్షా యాభైవేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విచారణలో నిందితుడి గురించి తెలుసుకుని పోలీసులే నోళ్లు వెళ్లబెట్టారు. నిందితుడు హెచ్ఆర్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తి చేశాడు. పైగా గోల్డ్మెడల్ కూడా సాధించాడు. మరి ఉద్యోగం వదిలేసి దొంగతనాలను ఎంచుకున్నాడెందుకో అని తలలు పట్టుకున్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..