Master Plan: మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం.. రైతు జే.ఏ.సి. సంబరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Master Plan: మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ కౌన్సిళ్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రెండు మున్సిపాల్టీలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. డ్రాఫ్ట్ ను రద్దు చేస్తూ పాలకవర్గాలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే.. కౌన్సిల్ సమావేశంలో మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. అడ్లూర్ లో రైతు జే.ఏ.సి. సంబరాలు చేసుకున్నారు. విలీన గ్రామాల రైతులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం రైతుల విజయమని రైతు జే.ఏ.సి. నాయకులు తెలిపారు. ఎన్టీవీతో రైతు జే.ఏ.సి. నేతలు మాట్లాడుతూ.. తమ ఐక్య ఉద్యమంతో సర్కారు దిగి వచ్చిందని అన్నారు. మున్సిపల్ సమావేశంలో తీర్మానం మా పోరాట ఫలితమే అన్నారు. అందరికి అనుకూలమైన మాస్టర్ ప్లాన్ మాత్రమే అమలు చేయాలని సూంచించారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం రైతుల విజయమే అన్నారు. మాస్టర్ ఫ్లాన్ పై తాత్కాలిక ఉపశమనం రైతులు వద్దు అంటున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానాలు కాదని, ముసాయిదా రద్దు అయినట్లు ప్రభుత్వం నుండి ప్రకటన కావాలన్నారు. మాస్టర్ ఫ్లాన్ పై వెనక్కి తగ్గేది లేదని రైతులు అన్నారని తెలిపారు.
Read also: Raghunandan Rao: సీఎస్కు రఘునందన్ రావు ఫోన్.. అపాయింట్ మెంట్ కావాలని..
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ పై రైతులు నగల నుంచి ఆందోళన చేస్తున్నారని తెలిపారు. దానిపై స్పష్టత కోసమే ఈ అత్యవసర సమావేశం నిర్వహించామన్నారు. మేం తీర్మానం చేసినది కాకుండా వేరే మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించాయని తెలిపారు. డిజైన్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్టు తీర్మానించామన్నారు. ప్రభుత్వానికి దీన్ని పంపిస్తామన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కూడా చెప్పారని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. రైతుల వెంటే మేముంటామన్నారు. బీఆర్ఎస్ రైతు ప్రభుత్వమన్నారు. ఎవరికి అన్యాయం జరుగదన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని సూచించారు. 60 రోజుల అభ్యంతరాలు తీసుకున్నాం కాబట్టి వాటిని కూడా ప్రభుత్వానికి పంపించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీయల్ జోన్ చేయమని స్పష్టం చేశారు.
TSPSC AEE: ఏఈఈ రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. ఆ టైం దాటిందో గేట్లు క్లోజ్
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!