Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
- 47 మంది మావోయిస్టుల భారీ లొంగుబాటు
- కోట్లలో పునరావాస ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం
- ఆయుధాలతో సరెండర్.. అదనపు నగదు ప్రోత్సాహం
- హెల్త్ కార్డులతో పూర్తి భద్రత.. ఇతరులకు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists Surrender : తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులై, హింసా మార్గాన్ని వీడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్న 47 మంది మావోయిస్టులు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. ఈ లొంగుబాటులో రాష్ట్ర కమిటీకి చెందిన 27 మందితో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన కీలక సభ్యులు, సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యులు ఉండటం గమనార్హం. వీరంతా తమ వెంట 34 అత్యాధునిక ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించి, శాంతియుత జీవనం వైపు అడుగులు వేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిజిపి శివధర్ రెడ్డి మాట్లాడుతూ, లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి హోదాను బట్టి ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేసిందని, రాష్ట్ర కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు, డివిజన్ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయలు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయలు , పార్టీ మెంబర్లకు లక్ష రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. వీరు అప్పగించిన ఆయుధాలకు కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు నగదు ప్రోత్సాహకాలు అందనున్నాయి. ముఖ్యంగా ఎల్ఎమ్జీ ఆయుధాలకు 5 లక్షలు, ఏకే-47లకు 4 లక్షల రూపాయల చొప్పున రివార్డులు లభిస్తాయి. మొత్తంగా ఈ 47 మందికి కలిపి సుమారు కోటి 50 లక్షల రూపాయల పునరావాస సహాయం అందుతోంది.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, లొంగిపోయిన వారి ఆరోగ్య భద్రతకు కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వీరికి త్వరలోనే ప్రత్యేక హెల్త్ కార్డులను జారీ చేయనున్నారు. ఈ కార్డుల ద్వారా నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ఆసుపత్రులలో వీరు ఉచితంగా వైద్య సదుపాయాలు పొందవచ్చు. గత రెండేళ్ల కాలంలో తెలంగాణ పోలీసుల సమర్థత వల్ల సుమారు 818 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఇది రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పరిణామమని డిజిపి అభివర్ణించారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర సభ్యులు కూడా హింసా మార్గాన్ని వీడి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ భారీ ఆపరేషన్ను విజయవంతం చేసిన ఎస్ఐబీ , ఇంటెలిజెన్స్ విభాగ అధికారులను డిజిపి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!