Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
- 47 మంది మావోయిస్టుల భారీ లొంగుబాటు
- కోట్లలో పునరావాస ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం
- ఆయుధాలతో సరెండర్.. అదనపు నగదు ప్రోత్సాహం
- హెల్త్ కార్డులతో పూర్తి భద్రత.. ఇతరులకు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists Surrender : తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులై, హింసా మార్గాన్ని వీడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్న 47 మంది మావోయిస్టులు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. ఈ లొంగుబాటులో రాష్ట్ర కమిటీకి చెందిన 27 మందితో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన కీలక సభ్యులు, సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యులు ఉండటం గమనార్హం. వీరంతా తమ వెంట 34 అత్యాధునిక ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించి, శాంతియుత జీవనం వైపు అడుగులు వేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిజిపి శివధర్ రెడ్డి మాట్లాడుతూ, లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి హోదాను బట్టి ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేసిందని, రాష్ట్ర కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు, డివిజన్ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయలు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయలు , పార్టీ మెంబర్లకు లక్ష రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. వీరు అప్పగించిన ఆయుధాలకు కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు నగదు ప్రోత్సాహకాలు అందనున్నాయి. ముఖ్యంగా ఎల్ఎమ్జీ ఆయుధాలకు 5 లక్షలు, ఏకే-47లకు 4 లక్షల రూపాయల చొప్పున రివార్డులు లభిస్తాయి. మొత్తంగా ఈ 47 మందికి కలిపి సుమారు కోటి 50 లక్షల రూపాయల పునరావాస సహాయం అందుతోంది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, లొంగిపోయిన వారి ఆరోగ్య భద్రతకు కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వీరికి త్వరలోనే ప్రత్యేక హెల్త్ కార్డులను జారీ చేయనున్నారు. ఈ కార్డుల ద్వారా నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ఆసుపత్రులలో వీరు ఉచితంగా వైద్య సదుపాయాలు పొందవచ్చు. గత రెండేళ్ల కాలంలో తెలంగాణ పోలీసుల సమర్థత వల్ల సుమారు 818 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఇది రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పరిణామమని డిజిపి అభివర్ణించారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర సభ్యులు కూడా హింసా మార్గాన్ని వీడి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ భారీ ఆపరేషన్ను విజయవంతం చేసిన ఎస్ఐబీ , ఇంటెలిజెన్స్ విభాగ అధికారులను డిజిపి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!