Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Maoist Central Commitee Member Mallojul Venugopal Emotional Letter

Mallojula Venugopal: తల్లి మరణంపై మావోయిస్టు నేత వేణుగోపాల్ భావోద్వేగ లేఖ

Published Date :November 13, 2022 , 8:34 am
By NTV WebDesk
Mallojula Venugopal: తల్లి మరణంపై మావోయిస్టు నేత వేణుగోపాల్ భావోద్వేగ లేఖ
  • Follow Us :
  • google news
  • dailyhunt

మావోయిస్టు నేతలు ఉద్యమంలో బిజీగా వుంటారు. వారు కుటుంబ సభ్యుల గురించి పట్టించుకునే తీరిక వుండదు. తాజాగా మావోయిస్టు కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ రావు రాసిన లేఖ హాట్ టాపిక్ అవుతోంది. తన తల్లి మరణంపై ఆయన రాసిన లేఖ అందరి హృదయాలను కదిలించేదిగా వుంది. ఈ లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు భావోద్వేగ లేఖలో … మీ అంత్యక్రియలకు రాలేనందుకు చింతిస్తున్నా.. పెద్దపల్లి పెద్దవ్వలేదని మావోయిస్టు పార్టీ ఏడుస్తున్నది.. నీ మరణం నాకే కాదు యావత్ మావోయిస్ట్ కుటుంబ సభ్యులకి తీరని లోటు. మల్లోజుల కోటేశ్వర రావు, వేణుగోపాల్ రావు లాంటి సామాన్య వ్యక్తులు మావోయిస్ట్ పార్టీకోసం కన్నావ్ అంటూ లేఖ రాశారు. నీ మరణం తనకే కాదు.. యావత్ మావోయిస్ట్ కుటుంబసభ్యులకు తీరని లోటని లేఖలో మల్లోజుల పేర్కొన్నారు. మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాల్రావు వంటి సామాన్యులను మావోయిస్ట్ పార్టీకోసం కన్నావని వేణుగోపాల్రావు గుర్తు చేశారు.

Read Also: Sunday Bhakthi Tv Stothra Parayanam Live: కార్తిక ఆదివారం ఈ స్తోత్రాలు వింటే..

Also Read

  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!

మల్లోజు వేణుగోపాల్ తల్లి మధురమ్మ గత నెల అక్టోబరు 1న మరణించారు. ఆమె వయసు 96 ఏళ్ళు. తండ్రి మల్లోజుల వెంకటయ్య 1997లో కన్నుమూశారు. ఈ దంపతుల ముగ్గురు కుమారులలో మల్లోజుల వేణుగోపాల్ చిన్నవాడు. సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వంలో పనిచేసిన కిషన్ జీ ఎలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు కు తమ్ముడు వేణుగోపాల్. 2011 నవంబరు 24న బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మృతిచెందాడు.

మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కు చెందిన పెద్దపల్లిలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. వేణుగోపాల్ మరో సోదరుడు అంజన్న పౌరోహిత్యం చేసుకుంటున్నాడు. వీరి తాత, తండ్రి.. ఇద్దరూ భారత స్వాతంత్ర్యసమరయోధులు. 2018 డిసెంబరు 4న జరిగిన ఎన్‌కౌంటర్‌లో నర్మద అక్కతో పాటు మావోయిస్ట్ కమాండర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ భార్య తారా అక్క కూడా మరణించింది.

Read Also: Kerala: అంతర్జాతీయ అంధుల ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన కేరళ గవర్నర్

పీపుల్స్ వార్ గ్రూపులో నాయకునిగా భూపతి, సోనూ, మాస్టర్, అభయ్ వంటి పేర్లతో పనిచేసాడు. మహారాష్ట్రలోని గార్చిరౌలీ ప్రాంతంలో గల మావోయిస్టుల దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా పనిచేసారు. అతను దక్షిణ భారత దేశంలోని పశ్చిమ కనుమలకు రెండు వైపులా, కేరళ లోని గోవా నుండి ఇడుక్కి వరకు గల గెరిల్లా జోన్ ను ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర పోషించాడని చెబుతారు. 2010లో చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్) మరణం తరువాత వేణుగోపాల్ ని సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీకి అధికార ప్రతినిధిగా నియమించారు.

ఏప్రిల్ 2010 దంతెవాడ ఘటనలో 76మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ కి చెందిన పోలీసుల మరణం వెనుక వేణుగోపాల్ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. కిషన్‌జీ మరణం తరువాత పశ్చిమ బెంగాల్ లో ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు.

Read Also: Thailand: గబ్బిలాల సూప్ వండుకొని తాగింది.. చివరకు జైలు పాలైంది..

Collage Maker 13 Nov 2022 08.55 Am

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Final Rites
  • Green Hunt
  • Kishanji
  • Mallojula venugopal
  • Maoist Movement

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions