Hyderabad: భారతదేశం నుండి చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్నారు. కొంతమంది అక్కడ పనిచేసి బాగా సంపాదిస్తున్నారు.. మరికొందరు ఇండియాకు వచ్చి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమాజంలో గొప్ప స్థానంలో నిలబెట్టాలనే కోరికతో విదేశాలకు పంపి చదివిస్తున్నారు. ఇటీవల విదేశాల్లో భారతీయ విద్యార్థులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. జాతి వివక్ష కారణంగా కొందరు కాల్పులు జరుపుతున్నారు. బాంబు పేలుళ్లు, రోడ్డు ప్రమాదాలు, సముద్రంలో మునిగిపోవడం వంటి అనేక కారణాలతో మృత్యువాత పడుతున్నారు. తాజాగా విదేశీ గడ్డపై మరో మహమ్మారి పడింది.
Read also: Etela Rajender: ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం అసాధ్యం..
ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడి మృతదేహం సముద్రంలో లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్కు చెందిన అరటి అరవింద్ యాదవ్ (30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అరవింద్ షాద్ నగర్ బీజేపీ నేత ఆరతి కృష్ణకు ఏకైక సంతానం. చదువు పూర్తయ్యాక ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్థిరపడ్డారు. ఐదు రోజుల క్రితం అరవింద్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గత సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు బంధువులు తెలిపారు.
ఇటీవల ఆస్ట్రేలియాలో వాతావరణం అనుకూలించకపోవడంతో అరవింద్ తల్లి ఉషారాణి వారం రోజుల క్రితం షాద్ నగర్ వచ్చింది. ఈ క్రమంలో సోమవారం కుటుంబ సభ్యులతో వచ్చేందుకు అరవింద్ విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. ప్రస్తుతం అరవింద్ భార్య గార్నిని.. కారు కడుక్కోవడానికి బయటకు వెళ్లిన అరవింద్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో సముద్రంలో ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహం అరవింద్దేనని నిర్ధారించారు. అయితే అరవింద్ ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయాడు? లేక ఎవరైనా చంపి సముద్రంలో పడేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
Minister Jupally Krishna Rao: కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తా..