Malreddy Ranga Reddy: మంచిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు.. దావూద్ను దాటేశాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి… ఎమ్మెల్యే మంచిరెడ్డిని ఈడీ విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే.. తొలి రోజు 8 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. రెండో రోజు కూడా ప్రశ్నిస్తున్నారు.. అయితే, ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు మల్రెడ్డి… ఈడీ దర్యాప్తు చేస్తున్న ఇంటర్నేషనల్ డాన్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దావూద్ ఇబ్రహీంని దాటి పోయారని వ్యాఖ్యానించారు.. ఇబ్రహీంపట్నంలో ఇందిరాగాంధీ పంచిన అసైన్డ్ భూముల మీద ఎమ్మెల్యే పడ్డారని విమర్శించిన ఆయన.. రైతుల దగ్గర నయీమ్ తో బెదిరించి భూములు గుంజుకున్నారని మండిపడ్డారు. 2015 నుండి హవాలా కేసులు ఉన్నాయని ఈడీ అంది.. కిషన్ రెడ్డి చేసిన మనీ లాండరింగ్ కి హవాలా డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.. ఈయనకు ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బు వచ్చింది.. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని..? ఇప్పుడేంత..? అని ప్రశ్నించారు.
Read Also: CM Jagan : ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో ఉపయోగం
Also Read
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
- Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ప్రభుత్వ భూములను బినామీగా ఆయన అనుచరుల దగ్గర పెట్టారని మంచిరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు మల్రెడ్డి.. ఇబ్రహీంపట్నంలో బెదిరించి పొలాలను అమ్ముకుంటున్నాడు.. ముఖ్యమంత్రి కేసీఆర్.. మీ ఎమ్మెల్యే చేసిన తప్పులకు మీకు సంబంధం లేకపోతే.. ఎమ్మెల్యేను పార్టీ నుండి, పదవి నుండి వెంటనే బహిష్కరించాలి.. 24 గంటల్లో పార్టీ నుండి బహిష్కరించపోతే ముఖ్యమంత్రి కూడా బాధ్యుడే అవుతారని విమర్శించారు.. ఫార్మా సీట్ లో 8632 ఎకరాల అసైన్డ్ భూమి లో 200 ఎకరాలు కొట్టేశారని విమర్శించిన ఆయన.. ఆరు నెలల క్రితం మాదాపూర్ లో మంచి రెడ్డి పట్టుపడితే వదిలేశారని.. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలెక్టర్ ని కొని ఎమ్మెల్యే గా డిక్లేర్ చేసుకున్నాడని.. ఇప్పుడు దొంగ పట్టుబడ్డాడంటూ ఫైర్ అయ్యారు.. ఈడీ ఒక్కటే సరిపోదు.. సీబీఐ, ఆదాయపన్నుశాఖతో కూడా విచారణ చేయాలని సూచించారు మల్రెడ్డి రంగారెడ్డి.
తాజావార్తలు
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!