Mallareddy University New Record: 30వేలమంది విద్యార్ధులతో మల్లారెడ్డి వర్శిటీ కొత్త రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్లా రెడ్డి విశ్వవిద్యాలయం ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆజాదీకా అమృత మహోత్సవం సందర్భంగా 30వేల మంది విద్యార్థులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఒక్కసారిగా భారత జాతీయ జెండాను రెపరెపలాడించారు. మల్లా రెడ్డి విశ్వవిద్యాలయం “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” ప్రచారాన్ని పురస్కరించుకుని 30,000 మంది విద్యార్థులతో మెగా ఈవెంట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో, విశ్వవిద్యాలయం ప్రపంచ రికార్డును నెలకొల్పింది, “365 రోజుల పాటు దేశభక్తితో ఉంటానని ప్రతిజ్ఞ చేసిన వారిలో అత్యధిక సంఖ్యలో (30,000) మంది భారత జాతీయ జెండాను ఊపుతూ” ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆరోగ్య వైద్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, కార్మిక ఉపాధి, కర్మాగారాలు & నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను శక్తివంతం చేయడం మరియు దేశం కోసం పాటుపడేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశ్యం.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, “మన పిల్లలు ఎంత బాగా విద్యనభ్యసిస్తారనే దానిపై భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో ఉన్న యువ జనాభాలో 65% కంటే ఎక్కువ మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. ఈ తరానికి అవకాశాలు కల్పించడంపై మనం దృష్టి పెట్టాలి, తద్వారా వారు భారతదేశం ఎదగడానికి మరియు అభివృద్ధి చెందడానికి సహాయపడతారు. ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు భారతదేశ భవిష్యత్తు, దృష్టి కేంద్రీకరించి మీ ఉత్తమమైన శ్రధ్ధని అందించండి అన్నారు మంత్రి హరీష్ రావు.
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
Read Also: Asia Cup 2022: ఆరు నిమిషాల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లన్నీ హాంఫట్..!!
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొత్త పోకడలకు యువత ఎక్కువగా గురవుతున్నందున, దేశంలో సాంకేతికతను అప్-గ్రేడ్ చేయడంలో ముందుకు తీసుకెళ్లడం లోనూ ఉత్ప్రేరకాలుగా ఉంటారని అని చెప్పగలం. యువ తరంలో ఎక్కువ మంది సాంకేతికతతో ఎక్కువగా నిమగ్నమై ఉన్నారు మరియు కొత్త సాంకేతికతలను త్వరగా ఆహ్వానిస్తారు. కొత్త ఆవిష్కరణలు,మరిన్ని పరిశోధనలు మరియు అధిక అభివృద్ధికి చాలా ప్రాధాన్యతనిస్తాము. భారత ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు స్టార్ట్-అప్ కంపెనీల వ్యవస్థ అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటన్నారు సోమేష్ కుమార్.
కార్మిక ఉపాధి, కర్మాగారాలు & నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ, “ఈ దేశభక్తి మరియు దేశం పట్ల నిబద్ధత యొక్క స్ఫూర్తి మీ హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోనివ్వండి. ప్రియమైన విద్యార్థులారా, దయచేసి గుర్తుంచుకోండి, మన ప్రతి పనిలో దేశం మొదటి స్థానంలో ఉండాలి,మరియు మిగతావన్నీ తరువాత. మన స్వాతంత్ర్య సమరయోధులు గతంలో చేసిన త్యాగాల వల్లనే ఈ రోజు మనం ఊపిరి పీల్చుకుని సంతోషంగా ఉండగలిగాము. కాబట్టి, మన ప్రతి ప్రయత్నంలో భారతదేశ స్ఫూర్తిని నింపడం మన ప్రాథమిక బాధ్యత. మనం ఏది చేసినా,మీరు ఎక్కడ ఉన్నా, మీ ప్రతి చర్య ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భారతదేశ కీర్తిని తదుపరి స్థాయికి నడిపించాలి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్” అని ఆశీర్వచనాలు అందించారు.
మల్లారెడ్డి యూనివర్శిటీ వైస్ఛాన్సలర్ డాక్టర్ వీఎస్కే రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మన చైతన్యవంతులైన విద్యార్థులు, సిబ్బంది సహకారంతో ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీ పేరును ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేశామని తెలియజేసేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉత్తేజకరమైన కార్యక్రమంలో 30,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొని భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం లో మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!