Mallareddy fire on IT: మల్లారెడ్డి ఫైర్.. దొరికింది గోరంత, ఐటీ డప్పు కొండంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallareddy fire on IT: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు నిన్న అర్థరాత్రితో ముగిసాయి. అయితే ఐటీ హై డ్రామాతో తన బంధువుల ఇంట్లో సోదాలు ముగియడంతో మంత్రి మల్లారెడ్డి పైర్ అయ్యారు. దొరికింది గోరంత అయితే ఐటీ డప్పు మాత్రం కొండంత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష్య పూరితంగానే ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నా పెద్ద కొడుకు దగ్గర 16 లక్షల దొరికాయి, చిన్నోడి దగ్గర 4 లక్షలు దొరికాయియని, అంతకుమించి అదనంగా రూపాయి దొరకలేదు కానీ రిపోర్ట్లో 8 కోట్లు దొరికినట్టు రాశారని మండిపడ్డారు. ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లారెడ్డి ఐటీ అధికారిని వెంటతీసుకెళ్లి పోలీసులకు మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. బోయిన్పల్లి పోలీస్లో ఫిర్యాదు చేశారు. దొంగతనంగా నా కుమారులతో సంతకం చేయించారని మండిపడ్డారు. ఇంత దుర్మార్గపు చర్యనా? అంటూ ప్రశ్నించారు. మేము నిజాయితీగా, పర్ఫెక్ట్గా పనిచేస్తున్నామన్నారు. అడ్డగోలుగా బ్లాక్ మనీ ఉందని, డొనేషన్స్ ఉన్నాయని, ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్ రాసి సంతకం తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు మల్లారెడ్డి.
Reada also: Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్కి కిక్కిచ్చే న్యూస్.. ఆ సినిమాకి ముహూర్తం ఫిక్స్?
Also Read
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
నా కుమారుడు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడని, మా ముందు అతడితో సంతకం చేయించుకుంటామన్నారని అన్నారు. చిన్న కుమారుడితోనూ సంతకం చేయిస్తామన్నరని తెలిపారు. నాకు తెలియకుండానే సంతకం చేయించుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఏం రాశారో చూపించకుండానే సంతకం తీసుకున్నారని మండిపడ్డారు. రిపోర్ట్లో ఏం రాశారో చూపించమని కోరుతున్నామని డిమాండ్ చేశారు. లేనివి ఉన్నట్టు రాశారని.. ఇంత మోసం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. అయితే.. మంత్రి మల్లారెడ్డిపై దుండిగల్ పీఎస్లో ఐటీ అధికారుల ఫిర్యాదు చేశారు. తమ అధికారిని మల్లారెడ్డి నిర్బంధించారని ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో మంత్రి మల్లరెడ్డి పై ఫిర్యాదు ఐటి అధికారులు చేశారు. 342 353 201 203 504 506 353 379 r/w 34 ipc సెక్షన్ కింద కేస్ నమోదు చేశారు. ఐటి సోదలో సేకరించిన డాకుమెంట్స్, పంచనామా, సెల్ ఫోన్స్, లాప్ టాప్స్ లను మంత్రి మల్లరెడ్డి లాకున్నట్లు పేర్కొన్నారు. డ్యూటీలో అధికారి విధులకు ఆటంకంపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక, ఐటీ అధికారులు మల్లారెడ్డిని టార్గెట్ చేశారని టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. ఐటీ అధికారులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఐటీ అధికారులకు మేము సంపూర్ణంగా సహకరిస్తున్నామని, కానీ వాళ్లు మాత్రం రిపోర్ట్లో ఏం రాశారో చూపించకుండానే సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. వీళ్లు దొంగలా, ఇన్కంట్యాక్స్ ఆఫీసర్లా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. సంతకం తీసుకోవడానికి అంత అర్జంట్ ఏముంది? అంటూ ప్రశ్నించారు.
Russia – Ukraine War : రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించిన ఈయూ పార్లమెంట్
తాజావార్తలు
-
Malayalam sequels : మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న సీక్వెల్స్.. వందల కోట్ల వసూళ్లతో రికార్డ్స్
-
Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత
-
Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
-
KING : షారూఖ్ ఖాన్ కింగ్ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!