TPCC Mahesh Goud : అలా మాట్లాడినందుకు నన్ను దేశద్రోహిగా ముద్ర వేశారు
- ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత అర్బన్ నక్సల్ ముద్ర
- కమ్యూనిస్టులతో విడదీయరాని అనుబంధం - మఖ్దూమ్ను స్మరించిన మహేశ్ గౌడ్
- లౌకికవాద శక్తుల బలపాటే ప్రజాస్వామ్య రక్షణకు మార్గం: మహేశ్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్పై రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన వెంటనే తనపై అర్బన్ నక్సలైట్, దేశద్రోహి ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. గురువారం సీపీఐ మఖ్దూమ్ కార్యాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, మఖ్దూమ్ తెలుగు నేలపై జన్మించిన గొప్ప కమ్యూనిస్టు నేత అని కొనియాడారు. సింగరేణి కార్మిక ఉద్యమంతో ఆయనకు ఆత్మీయ సంబంధం ఉందని తెలిపారు. 1974 ఫిబ్రవరి 17న జరిగిన ఈ కార్యాలయ పునాది కార్యక్రమానికి అప్పటి కాంగ్రెస్ మంత్రులు హాజరయ్యారని గుర్తు చేశారు. కాంగ్రెస్–కమ్యూనిస్టుల అనుబంధం విడదీయరానిదని స్పష్టంచేశారు.
Also Read
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
Tata Motors: టాటా కర్వ్.ev, నెక్సాన్.ev కస్టమర్లకు గుడ్ న్యూస్..
“నేను ఎప్పటినుంచో కమ్యూనిస్టు భావజాలానికి మద్దతుగా ఉన్నాను. ఈ దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం నిలదొక్కుకోవాలంటే లెఫ్ట్ శక్తులు బలపడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులతో కలిసి విజయాన్ని సాధించాం” అని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన ఆయన, ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ భూసంపదను కార్పొరేట్ కంపెనీలకు దక్కించేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. “మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినా, కేంద్రం మానవతా దృక్పథంతో కాకుండా మారణయత్నాలతో ముందుకు వెళుతోంది. ఇది బాధాకరం” అని అన్నారు.
ఇక ఎలక్షన్ కమిషన్ వ్యవహారాలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా ఈ సంస్థ మారిందని, ఇది ప్రజాస్వామ్యానికి శోచనీయ పరిణామమని విమర్శించారు.
తాజావార్తలు
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!