CM Revanth Reddy: నేడు పాలమూరులో సీఎం పర్యటన.. మూడంచెల భద్రత
- నేడు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- సభా ప్రాంగణం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు..
- మొత్తం రెండు వేల మంది పోలీసు సిబ్బందిలో భారీ బందోబస్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: నేడు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు కొనసాగిన రైతుల పండగ సభ ఇవాళ ముగింపు దశకు చేరుకుంది. కాగా.. రైతు పండగ ముగింపు సభలో సీఎం హాజరై ప్రసంగించనున్నారు. సీఎం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 3:30 గంటలకు మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్కు చేరుకుంటారు. సమీపంలోని రైతు పండగ సదస్సును సందర్శించి స్టాళ్లను పరిశీలించనున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
Read also: Russia Ukraine War: దేవుడా మాకొద్దు ఈ యుద్ధం.. దేశం వదలి పారిపోతున్న ఉక్రెయిన్ సైనికులు
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
సీఎం రానున్న నేపథ్యంలో.. సభా ప్రాంగణం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం రెండు వేల మంది పోలీసు సిబ్బందిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో మహబూబ్ నగర్ ఎస్పీ జానకి పూర్తి బందోబస్తును పర్యవేక్షించారు. ఐజీ ఎప్పటికప్పుడు సీనియర్ పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేస్తారు. కాగా..పాలమూరు జిల్లాతో పాటు నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ నుంచి ప్రత్యేక సిబ్బందిని రప్పించారు. ఆరుగురు ఎస్పీలు, ఏడుగురు ఏఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 36 మంది సీఐలు, 58 మంది ఎస్ఐలు, 91 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 700 మంది కానిస్టేబుళ్లు, 139 మంది మహిళలు, 174 మంది పురుష హోంగార్డులకు విధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
Read also: Astrology: నవంబర్ 30, శనివారం దినఫలాలు
అంతేకాకుండా.. ఎనిమిది రోప్ పార్టీలు, ఎనిమిది స్పెషల్ పార్టీలు, ఐదు సీపీటీ బృందాలు, 40 మంది గ్రేహౌండ్స్ పోలీసు బలగాలను నియమించారు. కాగా.. ట్రాఫిక్ మళ్లించేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల నుంచి 267 మందిని తీసుకొచ్చారు. ట్రాఫిక్ మళ్లింపుకు ప్రత్యేకంగా ఇద్దరు డీసీపీలు, ముగ్గురు ఏసీపీలు, ఏడుగురు సీఐలు, 27 మంది ఎస్ఐలు, 37 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 199 మంది కానిస్టేబుళ్లను నియమించారు. ఇక మహబూబ్నగర్, భూత్పూర్ రహదారులతో పాటుగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించినట్లు అధికారులు తెలిపారు. దీనిని పరిగణలోకి తీసుకుని వాహనదారులు వేరే రూట్లలో పయనించాలని సూచించారు.
IND vs PAK U-19: నేడే దాయాదుల పోరు.. భారత్ను ఓడించే దమ్ము పాకిస్థానుకు ఉందా
తాజావార్తలు
-
Chintamaneni Prabhakar: ఏలూరులో అర్ధరాత్రి హైడ్రామా.. ఎమ్మెల్యే చింతమనేని హల్చల్, శ్రీనివాస్ సస్పెండ్!
-
Explainer: బ్రిటన్ ఎందుకు తగలబెడుతోంది? వలసదారులపై ఎందుకింత ఆగ్రహం?
-
Dassahra Movies : దసరా బరిలో బాలయ్య, చిరు, వెంకీ, నాగ్.. విజయం ఎవరిని వరిస్తుందో
-
Alcohol With Drinks: మందులో ఆ డ్రింక్ మిక్స్ చేసుకొని తాగుతున్నారా? డాక్టర్లు చెప్పిన షాకింగ్ ఫ్యాక్ట్!
-
Credit Card Rules: ఈ బ్యాంకు క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. మినిమమ్ డ్యూ చెల్లిస్తే భారీ నష్టం.. కొత్త రూల్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!