BRS Party: బీఆర్ఎస్ లో ఎలా చేరాలి..? ఓ అభిమాని ట్విట్ కు కవిత రిప్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Party: మహారాష్ట్రకు చెందిన సాగర్ అనే అభిమాని బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలని ఎమ్మెల్సీ కవితను ట్విట్టర్లో ప్రశ్నించారు. దీనిపై కవిత స్పందిస్తూ దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని సీఎం కేసీఆర్ కు మద్దతు తెలపాలని సూచించారు. తెలంగాణ తరహాలో దేశంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఏర్పడాలంటే దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ విధానాలకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆకర్షితులవుతున్నారనడానికి ఇదే నిదర్శనమని సాగర్ అన్నారు. ఇటీవల నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ మహారాష్ట్ర ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపిందని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలన్నదే అన్ని రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సాగర్ అనే అభిమాని చేసిన ట్విట్ కు ఎమ్మెల్సీ కవిత ట్యాగ్ చేస్తూ రిప్లై ఇవ్వడంతో.. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ మారింది.
Sagar Ji, you can support our leader and Hon’ble CM KCR Garu and @BRSparty by joining us in our public meetings and programs across the country.
Also Read
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
DM your contact details. We are happy to welcome you 😊 #AbkiBaarKisaanSarkar https://t.co/TnBdaB8r6D
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 20, 2023
అయితే… కవిత ఈ నెల 25న ముంబై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023 పేరిట జరిగే సదస్సులో ఎమ్మెల్సీ పాల్గొంటారు. 2024 ఎన్నికలు-ప్రతిపక్ష వ్యూహం అనే అంశంపై జరిగే చర్చలో కవిత పాల్గొని తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలు, దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళిత బంధు, రైతుబీమా వంటి పథకాల ప్రాధాన్యతను ఈ వేదిక ద్వారా కవిత వివరించనున్నారు. ఈ సదస్సులో కవితతో పాటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆప్ ఎంపీ రాఘవ చద్దా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితాదేవ్ పాల్గొనున్నారని సమాచారం.
తాజావార్తలు
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!