మూసీ కాల్వలో మురికి ఎంతనో.. టీఆర్ఎస్ నేతల అవినీతి అంత : మధుయాష్కీ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ ఫ్లీనరీ సమావేశంపై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం మొత్తం.. వారి పొగడ్తలకే సరిపోయింది. అమరులను ఒక్కరినీ గుర్తు చేసుకోలేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూసీ కాల్వలో మురికి ఎంతుందో.. టీఆర్ఎస్ నేతల అవినీతి అంతలా పేరుకుపోయిందన్నారు.
తెలంగాణ వచ్చాక కేసీఆర్కు వందల ఎకరాల భూమి , ఇతర దేశాల్లో వ్యాపార సామ్రాజ్యం ఎలా పెరిగిందని ప్రశ్నించారు. బీజేపీ నేతలు.. ఎందుకు విదేశీ వ్యాపారం పై రైడ్స్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ఏడేళ్ల కాలంలో ఆత్మహత్యలు ఆగలేదని, నిరుద్యోగ యువత పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. దేశంలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్న స్థానాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నా కేసీఆర్కు సోయి లేదని మధు యాష్కీ అన్నారు.
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
సీఎం కేసీఆర్ స్వంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారో చెప్పాలని, కోటి ఎకరాల మాగాణి అంటూ.. వరి వేస్తే ఉరి అని ఎందుకు అంటున్నారని మధు యాష్కీ ప్రశ్నించారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పడింది.. అందులో కేసీఆర్ గొప్పతనం ఏమీ లేదు, తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనకుంటే.. గొర్రెలు, బర్రెలు అంటున్నారన్నారు. రాహు కాలం.. రావుల కాలంలో ఏమీ రావన్నట్లు పరిస్థితి తయారైందని, ఇక టీఆర్ఎస్ వీఆర్ఎస్ పలకాల్సిన సమయం వచ్చిందని మధు యాష్కీ అన్నారు.
- Tags
- congress
- kcr
- Madhuyashki
- TRS
తాజావార్తలు
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
-
Mohammad Rizwan – Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ – బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!