మూసీ కాల్వలో మురికి ఎంతనో.. టీఆర్ఎస్ నేతల అవినీతి అంత : మధుయాష్కీ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ ఫ్లీనరీ సమావేశంపై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం మొత్తం.. వారి పొగడ్తలకే సరిపోయింది. అమరులను ఒక్కరినీ గుర్తు చేసుకోలేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూసీ కాల్వలో మురికి ఎంతుందో.. టీఆర్ఎస్ నేతల అవినీతి అంతలా పేరుకుపోయిందన్నారు.
తెలంగాణ వచ్చాక కేసీఆర్కు వందల ఎకరాల భూమి , ఇతర దేశాల్లో వ్యాపార సామ్రాజ్యం ఎలా పెరిగిందని ప్రశ్నించారు. బీజేపీ నేతలు.. ఎందుకు విదేశీ వ్యాపారం పై రైడ్స్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ఏడేళ్ల కాలంలో ఆత్మహత్యలు ఆగలేదని, నిరుద్యోగ యువత పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. దేశంలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్న స్థానాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నా కేసీఆర్కు సోయి లేదని మధు యాష్కీ అన్నారు.
Also Read
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
సీఎం కేసీఆర్ స్వంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారో చెప్పాలని, కోటి ఎకరాల మాగాణి అంటూ.. వరి వేస్తే ఉరి అని ఎందుకు అంటున్నారని మధు యాష్కీ ప్రశ్నించారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పడింది.. అందులో కేసీఆర్ గొప్పతనం ఏమీ లేదు, తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనకుంటే.. గొర్రెలు, బర్రెలు అంటున్నారన్నారు. రాహు కాలం.. రావుల కాలంలో ఏమీ రావన్నట్లు పరిస్థితి తయారైందని, ఇక టీఆర్ఎస్ వీఆర్ఎస్ పలకాల్సిన సమయం వచ్చిందని మధు యాష్కీ అన్నారు.
- Tags
- congress
- kcr
- Madhuyashki
- TRS
తాజావార్తలు
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!