Chain Snatching Batch: చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్.. 8 తులాల బంగారం స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhapur Zone Police Arrested Chain Snatching Batch: హైదరాబాద్లో చైన్ స్నాచింగ్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు.. బైక్ వేసుకుని వెళ్లి, మెడలో ఉండే గొలుసులు లాగేసుకుంటున్నారు. ఈజీ మనీకి అలవాటుపడిన యువత.. ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కేవలం నగరంలో ఉండే వాళ్లు కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువత సైతం గొలుసు దొంగలించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ గొలుసు దొంగలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఘటన జరిగిన వెంటనే అదుపులోకి తీసుకునేలా చర్యలు చేపట్టారు. ఇప్పుడు తాజాగా ఓ ముఠాని మాదాపూర్ జోన్ పోలిసులు పట్టుకున్నారు. చోరీ చేసిన బైక్లతో చైన్ స్నాచింగ్కి పాల్పడుతున్న ముఠాని అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో మొత్తం నలుగురు సభ్యులు ఉండగా.. 8 తులాల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు.
Harish Rao: ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్లో హరీశ్ రావు మీటింగ్.. కొన్ని కీలక నిర్ణయాలు
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
ఈ కేసు గురించి మాదాపూర్ డీసీపీ శిల్పవళ్లి మాట్లాడుతూ.. జులై 13వ తేదీన చందానగర్, మియాపూర్ పీయస్ పరిధిలో చైన్ స్నాచింగ్లు జరిగాయన్నారు. అదే సమయంలో ఆర్సీపురం పీఎస్ పరిధిలోనూ ఒక ఒక బైక్ చోరీకి గురైందన్నారు. ఆ చోరీ చేసిన బైక్తోనే చందానగర్, మియాపూర్, సంగారెడ్డిలో స్నాచింగ్లకు పాల్పడ్డారన్నారు. ఆ బైక్ ఆధారంగా తాము విచారణ చేపట్టి.. నలుగుర్ని అరెస్ట్ చేశామన్నారు. ఈ ముఠా సభ్యులు ముంబైకి చెందినవారని, వీరిపై గతంలోనూ కేసులు ఉన్నాయని తెలిపారు. A1 అమ్జద్ ఇక్బాల్ షేక్ ముంబైకి చెందినవాడని, అతడు 14 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని అన్నారు. A2 షౌకత్ హుస్సేన్ ఖాన్ సైదాబాద్లో పలు కేసులో నిందితుడిగా ఉన్నాడని.. అలాగే A3 తన్వీర్ ఖాన్ ఆ ఇద్దరితో కలిసి గతంలో చోరీలకు పాల్పడ్డాడని చెప్పారు. ఇక A4 విజయ్ కమలాకాంత్ యాదవ్ రిసీవర్ అని.. ఆ ముగ్గురు చోరీకి పాల్పడితే, ఇతను రిసీవ్ చేసుకుంటాడని వివరించారు.
Health Tips: రోజూ పొద్దున్నే దీన్ని తింటే.. 60 ఏళ్లు వచ్చినా వయస్సు ఎంతో కనిపెట్టలేరు..!
జులై 13వ తేదీన ఉదయం11:30 గంటల సమయంలో ఆర్సీ పురంలో బైక్ చోరీ అయ్యిందని.. మద్యాహ్నం 12 గంటలకు మియాపూర్లో స్నాచింగ్కి పాల్పడ్డారని డీసీపీ వెల్లడించారు. ఆ వెంటనే 1 గంటకి చందానగర్లో, అనంతరం సాయంత్రం 6 గంటలకు సంగారెడ్డిలో చైన్ స్నాచింగ్ అటెంప్ట్ చేశారని అన్నారు. రాత్రి 7:30 గంటలప్పుడు మరోసారి మియాపూర్లో చైన్ స్నాచింగ్కి పాల్పడినట్లుగా ఆమె తెలిపారు. తాము ఈ కేసుని సీరియస్గా తీసుకుని.. నిందితుల ఆచూకీ కనుగొని అరెస్ట్ చేశామని డీసీపీ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!