Madhapur Water Contamination: పెరుగుతున్న బాధితులు.. ప్రత్యేక ఐసీయూ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. గుట్టల బేగంపేటలో జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై (water contamination) ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా వుంది. కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని వాటర్ వర్క్స్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి భీమయ్య (27) మృతిచెందగా.. రెండేళ్ల అతని కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
https://ntvtelugu.com/nvss-prabhakar-slams-trs-govt-on-drugs/
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వడ్డెర కాలనీకి చెందిన బాధితులలో ఒక మహిళ పరిస్థితి విషమంగా వుంది. బాధితులలో 11 మంది చిన్నారులు వున్నారు. వారంతా చలి, విపరీత జ్వరం, వాంతులతో బాధపడుతున్నారు. రాత్రి నుంచి గంట గంటకి బాధితులు గంటగంటకి పెరగడంతో వైద్యులు సీరియస్ గా ఉన్న వారిని ప్రైవేట్ హాస్పిటల్స్ కి తీసుకుని వెళ్ళమని చెబుతున్నారు.
15 రోజులు నుంచి నీరు రంగు మారి వాసన వస్తుందని చెబుతున్నారు బాధితులు. ఎన్ని సార్లు చెప్పిన అధికారులు పట్టించుకోలేదంటున్నారు స్థానికులు. కలుషిత నీరు వస్తుందని చాలా రోజులుగా చెబుతున్నాం అన్నారు బాధితుడు భీమయ్య కుటుంబసభ్యులు. నీళ్ళు వదిలే లైన్ మెన్ కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదంటున్నారు.
వాటర్ ఫిల్టర్ కొనుక్కోని తాగాలంటున్నారు అధికారులు. ఇవాళేమో ఆ వాటర్ తో స్నానం కూడా చేయవద్దని చెబుతున్నారు. ఇన్ని రోజులు స్నానం చేయవద్దని చెబుతున్నారు. భీమయ్య తో పాటు అతని ఇద్దరి పిల్లలకు నిన్న సీరియస్గా ఉందని, వారిని ఆస్పత్రికి తీసుకువెళ్ళాం. ఈలోగా భీమయ్య కు వాంతులు ఎక్కువగా అయ్యాయని, ఆస్పత్రికి తరలించినా కాపాడుకోలేకపోయామన్నారు. ఇదిలా వుంటే.. మాదగ్గరికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఎక్కువ మంది వస్తున్నారని, ఇవాళ 43 మంది బస్తీ వాసులకు ట్రీట్మెంట్ ఇచ్చామన్నారు కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్.
సీవియర్ గా ఉన్న వారినే ఆస్పత్రికి తరలిస్తున్నాం అన్నారు. ఫుడ్ లేదా వాటర్ పాయిజన్ జరిగినట్లు తెలుస్తోంది. అందరూ ఒకే లక్షణాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అవుతున్నారు. రికవరీ ఆయిన వారిని డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నారు. పిల్లలు తట్టుకోలేక పోతున్నారు, వారి కి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. సీరియస్ గా ఉన్న వారికి ఐ సీ యూ ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు గుట్టల బేగంపేట్ బస్తీలో కలుషిత నీరు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. జీహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ అధికారుల మధ్య సమన్వయ లోపం ద్వారానే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు. వాటర్ వర్క్స్ ఎండి పై కేసు నమోదు చేయాలంటూ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు బీజేపీ నేతలు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!