Madhapur DCP Shilpavalli: దుర్గం చెరువు ఘటనలు.. రెండేళ్లలో ఎనిమిది మంది సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Durgam Cheruvu: దుర్గం చెరువు వద్ద ఇప్పటివరకు రెండేళ్లలో ఎనిమిది మంది ఆత్మయత్నం చేశారని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మాధాపూర్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి పాయల్ అనే యువతి ఆత్మహత్యపై డీసీపీ స్పందించారు. రెండేళ్లలో ఇప్పటి వరకు దుర్గం చెరువు వద్ద ఎనిమిది మంది ఆత్మయత్నం చేశారని అన్నారు. అందులో ఇద్దరిని కాపాడామని అన్నారు. కేబుల్ బ్రిడ్జ్ పై నుండి పాల్పడుతున్నారని పోలీసు అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. వాకర్స్ వెళ్ళేటప్పుడు నిఘా ఉంచుతున్నామని అన్నారు. నిన్న మధ్యాహ్నం దుర్గం చెరువులో యువతి దూకిందని, ఆ టైంలో ఆమెతో పాటు మరొకరు కూడా ఉన్నారని అన్నారు. చెరువులో బురద ఉండటంతో అందులో ఇరుక్కుపోయిందని భావిస్తున్నామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ టీం సెర్చ్ చేస్తుందని అన్నారు.
Read also: Sree Leela: నువ్వు అలా పిలవాలే కానీ… కుర్రాళ్లు ఎక్కడికైనా వస్తారు
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
మాధాపూర్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన పాయల్ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం నిమిత్తం ఈ యువతి జాబ్ కోసం నగరానికి వచ్చింది. జూబ్లీహిల్స్లోని ఒకరి ఇంట్లో హౌస్మేడ్గా చేరింది. సూసైడ్ చేసుకోవడానికి ముందు.. పాయల్ తన స్నేహితురాలితో కలిసి డీమార్ట్లో షాపింగ్ చేసింది. అక్కడి నుంచి వీళ్లిద్దరు నేరుగా కేబుల్ బ్రిడ్జికి వెళ్లారు. కేబుల్ బ్రిడ్జి ఫుట్ఫాత్పై సరదాగా మాట్లాడుకుంటూ కాసేపు నడిచారు. ఇంతలో పాయల్ కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఒక్కసారిగా దూకేసింది. పాయల్ చర్యతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఆమె స్నేహితురాలు.. పాయల్ చెరువులోకి దూకుకుండా కాపాడేందుకు ఆపే ప్రయత్నం చేసింది. కానీ.. ఆమె ప్రయత్నం విఫలమైంది. భయంతో వణికిపోయిన పాయల్ స్నేహితురాలు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఆమె సమాచారం మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుర్గం చెరువులో పాయల్ మృతదేహం కోసం డీఆర్ఎఫ్ టీమ్ గాలిస్తున్నారు. పాయల్ సూసైడ్కి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఓ యువకుడ్ని పాయల్ గాఢంగా ప్రేమిస్తోందని, అయితే ఆమె కుటుంబసభ్యులు అందుకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసింది. కుటుంబీకులు తమ ప్రేమని అంగీకరించడం లేదు కాబట్టి, అతనితో తనకు పెళ్లి జరగదన్న మనస్థాపంతోనే పాయల్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
Sree Leela: నువ్వు అలా పిలవాలే కానీ… కుర్రాళ్లు ఎక్కడికైనా వస్తారు
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!