Madhapur DCP Shilpavalli: దుర్గం చెరువు ఘటనలు.. రెండేళ్లలో ఎనిమిది మంది సూసైడ్
Durgam Cheruvu: దుర్గం చెరువు వద్ద ఇప్పటివరకు రెండేళ్లలో ఎనిమిది మంది ఆత్మయత్నం చేశారని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మాధాపూర్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి పాయల్ అనే యువతి ఆత్మహత్యపై డీసీపీ స్పందించారు. రెండేళ్లలో ఇప్పటి వరకు దుర్గం చెరువు వద్ద ఎనిమిది మంది ఆత్మయత్నం చేశారని అన్నారు. అందులో ఇద్దరిని కాపాడామని అన్నారు. కేబుల్ బ్రిడ్జ్ పై నుండి పాల్పడుతున్నారని పోలీసు అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. వాకర్స్ వెళ్ళేటప్పుడు నిఘా ఉంచుతున్నామని అన్నారు. నిన్న మధ్యాహ్నం దుర్గం చెరువులో యువతి దూకిందని, ఆ టైంలో ఆమెతో పాటు మరొకరు కూడా ఉన్నారని అన్నారు. చెరువులో బురద ఉండటంతో అందులో ఇరుక్కుపోయిందని భావిస్తున్నామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ టీం సెర్చ్ చేస్తుందని అన్నారు.
Read also: Sree Leela: నువ్వు అలా పిలవాలే కానీ… కుర్రాళ్లు ఎక్కడికైనా వస్తారు
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
మాధాపూర్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన పాయల్ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం నిమిత్తం ఈ యువతి జాబ్ కోసం నగరానికి వచ్చింది. జూబ్లీహిల్స్లోని ఒకరి ఇంట్లో హౌస్మేడ్గా చేరింది. సూసైడ్ చేసుకోవడానికి ముందు.. పాయల్ తన స్నేహితురాలితో కలిసి డీమార్ట్లో షాపింగ్ చేసింది. అక్కడి నుంచి వీళ్లిద్దరు నేరుగా కేబుల్ బ్రిడ్జికి వెళ్లారు. కేబుల్ బ్రిడ్జి ఫుట్ఫాత్పై సరదాగా మాట్లాడుకుంటూ కాసేపు నడిచారు. ఇంతలో పాయల్ కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఒక్కసారిగా దూకేసింది. పాయల్ చర్యతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఆమె స్నేహితురాలు.. పాయల్ చెరువులోకి దూకుకుండా కాపాడేందుకు ఆపే ప్రయత్నం చేసింది. కానీ.. ఆమె ప్రయత్నం విఫలమైంది. భయంతో వణికిపోయిన పాయల్ స్నేహితురాలు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఆమె సమాచారం మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుర్గం చెరువులో పాయల్ మృతదేహం కోసం డీఆర్ఎఫ్ టీమ్ గాలిస్తున్నారు. పాయల్ సూసైడ్కి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఓ యువకుడ్ని పాయల్ గాఢంగా ప్రేమిస్తోందని, అయితే ఆమె కుటుంబసభ్యులు అందుకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసింది. కుటుంబీకులు తమ ప్రేమని అంగీకరించడం లేదు కాబట్టి, అతనితో తనకు పెళ్లి జరగదన్న మనస్థాపంతోనే పాయల్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
Sree Leela: నువ్వు అలా పిలవాలే కానీ… కుర్రాళ్లు ఎక్కడికైనా వస్తారు
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!