రాహుల్ తో భేటీ కోసం ఢిల్లీ వెళ్ళిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణా లో రైతులు, ఆందోళనలో ఉన్నారు.ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకోవాల్సింది పోయి..బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు..
తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సప్లై చెయ్యమని ముఖ్యమంత్రి చేసిన సంతకం రైతులపట్ల మరణశాసనం లా మారింది.కేసీఆర్ సంతకం మరణశాసనం లా మారింది.రైతులు పండించిన వడ్లను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది.రాష్ట్రం సేకరించిన ధాన్యాన్ని, కేంద్రం కొనాలి.తెలంగాణ లోని రైస్ మిల్లర్లతో కేసీఆర్ కుటుంబ సభ్యులు కుమ్మక్కు అయ్యారు..అందుకే ఈ పరిస్థితి వచ్చింది.