తెలంగాణ ప్రజల కోసం నేను ప్రాణం అయినా ఇస్తానన్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. బంగారు తెలంగాణ అయిందా? వెండి తెలంగాణ అయినా అయిందా? అప్పుల తెలంగాణ అయింది. అప్పులు ఎందుకు అయిపోయాయి? నాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరని పాల్ ప్రశ్నించారు. 8 ఏళ్ళ వరకూ నిరుద్యోగులు గుర్తుకురాలేదా? నాకు సెక్యూరిటీ అడిగినా ఇవ్వలేదు. నేను రాకుంటే ఇంకా దోచుకుంటారా? ఇంకా తెలంగాణను అమ్మేస్తారా? మీకోసం నేను వచ్చా. ఒక్కొక్కరు వందమంది వెయ్యిమందికి చెప్పండి. అన్నివర్గాల వారు నాకు ఓటేద్దాం. నియోజకవర్గానికి ఆస్పత్రి కడతాం. ఒకసారి ఆలోచించండి. కలిసి పోరాడదాం. మనకు మంచి తెలంగాణ కావాలి. నా సభకు పర్మిషన్ ఇవ్వాలి. లేకుంటే రాహుల్ సభకు పర్మిషన్ క్యాన్సిల్ చేయండి. నేను వస్తానంటే లక్షలమంది వస్తారు. నేను ఎవరికీ డబ్బులివ్వలేదు.