Wines Tender : మద్యం షాపుల కోసం మహిళల పోటీ.. ఒకే మహిళ 150 షాపులకు దరఖాస్తు..
- మద్యం దుకాణాల దరఖాస్తులకు భారీ స్పందన
- ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో మహిళ దరఖాస్తు దారుల సందడి
- నిన్నటి వరకు 50 వేల దరఖాస్తులు
- రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం షాపులకు లైసెన్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wines Tender : రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తులకు ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించబడుతున్నాయి. ముఖ్యంగా మహిళా అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఎక్సైజ్ కార్యాలయాలు రద్దీగా మారాయి. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయ సమాచారం ప్రకారం ఇప్పటివరకు 50 వేల దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఈరోజు మరో 50 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు కావడంతో దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఆదాయం చేరింది.
Tirupathi : తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం..మత్తులో ములిగిపోయిన యువత
Also Read
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
ఈసారి రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వనున్నారు. అందుకోసం దరఖాస్తుల స్వీకరణ వేగంగా కొనసాగుతోంది. గౌడ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అయితే సొండి సామాజిక వర్గానికి కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కొందరు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణతో పాటు యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చి దరఖాస్తులు సమర్పించారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ 150 మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాల్లో వీరి ఆసక్తి ఎక్కువగా ఉంది.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక ఈనెల 23న మద్యం దుకాణాల లైసెన్స్ల కోసం డ్రా నిర్వహించనుంది. పారదర్శకత కోసం ఆన్లైన్ డ్రా పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఈసారి లైసెన్స్ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
ఈ మొత్తంలో భాగం రాష్ట్ర ఆదాయానికి గణనీయమైన తోడ్పాటు ఇవ్వనుంది. మద్యం దుకాణాల లైసెన్స్లపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో, ఎక్సైజ్ శాఖ కార్యాలయాల వద్ద వాతావరణం పండుగలా మారింది. ముఖ్యంగా మహిళా దరఖాస్తుదారుల ఉత్సాహం ఈసారి ప్రధాన ఆకర్షణగా మారింది.
Perni Nani: మంత్రి కొల్లు రవీంద్ర ఆస్తులపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!