Kusukuntla Prabhakar Reddy: మునుగోడు ఉపఎన్నికలో గెలిచిన TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేడు MLAగా ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఈ కార్యక్రమం జరగనుంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఉప ఎన్నిక తర్వాత TRS బలం అసెంబ్లీలో 104కు చేరింది. మజ్లిసు ఏడుగురు, కాంగ్రెస్ కు ఐదుగురు, BJPకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
మునుగోడులో మొత్తం 2,25,192 ఓట్లు పోలైతే.. టీఆర్ఎస్కు 42.95 శాతం ఓట్లు, బీజేపీకి 38.38 శాతం ఓట్లు, కాంగ్రెస్కు 10.58 శాతం ఓట్లు.. ఇతరులకు 08.09 శాతం ఓట్లు దక్కాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. మంత్రులు కేటీఆర్, జగదీష్రెడ్డి, హరీష్రావు.. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇలా అందరినీ బరిలోకి దింపారు.. ఇదే ఆ పార్టీకి కలిసివచ్చింది.. మునుగోడు గెలుపుతో.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీ వరుసగా మూడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది.
Read also: Kane Williamson: ఆ ఇద్దరి వల్లే కొంప కొల్లేరు.. కేన్ సంచలన వ్యాఖ్యలు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2014-2018 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు అదే రాజగోపాల్ రెడ్డిపై 10 వేల 309 ఓట్ల తేడాతో గెలిచారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టు 2న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2022 నవంబరు 3న జరిగే ఉప ఎన్నిక జరిగింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికలో విజయం సాధించారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాగా మునుగోడులో మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Pakistan Record: న్యూజిలాండ్పై రికార్డు సృష్టించిన పాకిస్థాన్