Bus Fire : కూకట్పల్లిలో తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..
- కూకట్పల్లిలో బస్సు అగ్నిప్రమాదం
- డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రాణాలు రక్షణ
- 18 మంది ప్రయాణికులు సురక్షితం
- షార్ట్ సర్క్యూట్ కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం రాత్రి భాగ్యనగరంలోని కూకట్పల్లిలో పెను అగ్నిప్రమాదం తృటిలో తప్పింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు కేపీహెచ్బీ మెట్రో పిల్లర్ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది. అయితే, బస్సు డ్రైవర్ ప్రదర్శించిన సమయస్ఫూర్తి 18 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. మంటలు బస్సును నిలువునా దహించివేసినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ట్రాఫిక్కు కూడా తీవ్ర అంతరాయం కలిగించింది.
Fish Pickle: చేపల పచ్చడి నీచు వాసన రాకుండా పర్ఫెక్ట్గా కుదరాలా.. అయితే సింపుల్గా ఇలా చేయండి!
Also Read
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి నుంచి ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లుకు బయల్దేరిన దుర్గా మల్లేశ్వరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (నెం. NL 02 B 9955), కొండాపూర్ , మియాపూర్ మీదుగా రాత్రి 10 గంటల సమయంలో కూకట్పల్లి మెట్రో పిల్లర్ 734 వద్దకు చేరుకుంది. ఆ సమయంలో బస్సు ఇంజిన్ భాగం నుండి ఒక్కసారిగా మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని గ్రహించిన డ్రైవర్, వెనువెంటనే ప్రయాణికులందరినీ కిందకు దింపేశారు.
ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించి భీభత్సం సృష్టించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే బస్సు మెజారిటీ భాగం పూర్తిగా కాలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సులో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితోనే పెను ముప్పు తప్పిందని ప్రయాణికులు , అధికారులు అభినందిస్తున్నారు.
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?
తాజావార్తలు
-
Vaibhav: అది సార్ ‘వైభవ్ సూర్యవంశీ’ అంటే.. తిట్టిన నోళ్లే జైజైలు కొట్టాయి.. ఫిదా అయిన లంక ఆటగాళ్లు..
-
Cricket Helmet History: క్రికెట్ హెల్మెట్ వెనుక ఆసక్తికర కథ.. ఎలా పుట్టిందో తెలుసా..
-
Ammonia Gas Leak : తమిళనాడులో ఘోరం.. అమ్మోనియా లీక్.. 7 మంది మృతి.!
-
Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
-
Anil Ravipudi: రక్త తిలకం దిద్దిన వెంకటేష్.. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ‘అనిల్ మార్క్’ నవ్వుల వర్షం!
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!