KTR Tweet: కేటీఆర్ సంచలన ట్వీట్.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. తెలంగాణలోనూ ఈ వేడుకలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మాజీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్లో సుమతి సతకాన్ని పోస్ట్ చేశారు. ఎప్పుడో పెద్దలు చెప్పినట్లుగా అంటూ ఓ క్యాప్షన్ పెట్టారు. ‘కనకపు సింహాసనమున శునకము’ అనే పద్యం కనిపిస్తుంది. మంచి ముహూర్తం చూసి కుక్కను సీటులో కూర్చోబెట్టినా మనసు మారదని అన్నారు. అనవసరంగా మాట్లాడి నోరు పాడు చేసుకోలేదని స్పష్టత ఇచ్చారు. ఎందుకు అంత అసహనం? ఇప్పటికీ మేమే అధికారంలో ఉన్నామని చెబుతున్నారని తెలిపారు. మేం అధికారంలో ఉన్నామని, ప్రతిపక్షంలో ఉన్నామని కాంగ్రెస్ వాళ్లు భావిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీల గవర్నర్ కోటాలో గవర్నర్ నిర్ణయం బీజేపీ, కాంగ్రెస్ లను ఉలిక్కిపడేలా చేసిందన్నారు. ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసినప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు విడివిడిగా జరిగాయన్నారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
Read also: Emmanuel Macron: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు గుడ్ న్యూస్..
రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒకే నోటిఫికేషన్ వస్తే బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీ పొందుతారని అన్నారు. కాంగ్రెస్ను జాకీలు పెంచుతున్నారు.. కాంగ్రెస్, బీజేపీ బంధాన్ని బయటపెట్టాలన్నారు. సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించాలని అన్నారు. కరోనా సమయంలో రెండేళ్లపాటు పని చేయలేకపోయాడని తెలిపారు. లేకుంటే సర్పంచ్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ‘గుంపు మేస్త్రీ’ అని సంబోధించారు. దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో అందులో పరోక్షంగా ముఖ్యమైన పదవిని ఉద్దేశించి ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు 👇 pic.twitter.com/G1Xl7AEeHt
— KTR (@KTRBRS) January 26, 2024
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!