KTR Tweet: కేటీఆర్ సంచలన ట్వీట్.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. తెలంగాణలోనూ ఈ వేడుకలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మాజీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్లో సుమతి సతకాన్ని పోస్ట్ చేశారు. ఎప్పుడో పెద్దలు చెప్పినట్లుగా అంటూ ఓ క్యాప్షన్ పెట్టారు. ‘కనకపు సింహాసనమున శునకము’ అనే పద్యం కనిపిస్తుంది. మంచి ముహూర్తం చూసి కుక్కను సీటులో కూర్చోబెట్టినా మనసు మారదని అన్నారు. అనవసరంగా మాట్లాడి నోరు పాడు చేసుకోలేదని స్పష్టత ఇచ్చారు. ఎందుకు అంత అసహనం? ఇప్పటికీ మేమే అధికారంలో ఉన్నామని చెబుతున్నారని తెలిపారు. మేం అధికారంలో ఉన్నామని, ప్రతిపక్షంలో ఉన్నామని కాంగ్రెస్ వాళ్లు భావిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీల గవర్నర్ కోటాలో గవర్నర్ నిర్ణయం బీజేపీ, కాంగ్రెస్ లను ఉలిక్కిపడేలా చేసిందన్నారు. ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసినప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు విడివిడిగా జరిగాయన్నారు.
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
Read also: Emmanuel Macron: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు గుడ్ న్యూస్..
రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒకే నోటిఫికేషన్ వస్తే బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీ పొందుతారని అన్నారు. కాంగ్రెస్ను జాకీలు పెంచుతున్నారు.. కాంగ్రెస్, బీజేపీ బంధాన్ని బయటపెట్టాలన్నారు. సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించాలని అన్నారు. కరోనా సమయంలో రెండేళ్లపాటు పని చేయలేకపోయాడని తెలిపారు. లేకుంటే సర్పంచ్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ‘గుంపు మేస్త్రీ’ అని సంబోధించారు. దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో అందులో పరోక్షంగా ముఖ్యమైన పదవిని ఉద్దేశించి ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు 👇 pic.twitter.com/G1Xl7AEeHt
— KTR (@KTRBRS) January 26, 2024
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..