KTR : ఒక్క ఓటు కూడా పోవద్దు.!
- ప్రతి బూత్లో మెజారిటీ లక్ష్యంగా పనిచేయండి
- అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ లిస్ట్
- డూప్లికేట్ ఓట్లపై ప్రత్యేక దృష్టి
- ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ధృవీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యూహాలను వివరించారు. ఎన్నికల సమయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) , పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. ఎంత పెద్ద నాయకుడైనా ముందు తన సొంత బూత్లో మెజారిటీని నిరూపించుకోవాలని, అప్పుడే పార్టీ గెలుపు సులువవుతుందని ఆయన స్పష్టం చేశారు.
అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ లిస్ట్.. ప్రతి ఓటూ ముఖ్యం
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాలపరిమితిని గుర్తుచేస్తూ.. ఆగస్టు 30 వరకు కొత్త ఓట్ల నమోదు, మార్పులు చేర్పులు , అభ్యంతరాలను స్వీకరించే సమయం ఉందని కేటీఆర్ తెలిపారు. సెప్టెంబర్ 28 నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తయి, అక్టోబర్ 1వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదలవుతుందని పేర్కొన్నారు. ఈ ఫైనల్ లిస్ట్ రాబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని, కాబట్టి ఒక్క ఓటు కూడా వృధా కాకుండా ప్రతి బూత్లోనూ కార్యకర్తలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) తో కలిసి ఓటరు జాబితాను నిరంతరం సరిచూసుకోవాలని ఆదేశించారు.
Also Read
- TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
- CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
- CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
- TGPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల.!
డూప్లికేట్ ఓట్ల గుర్తింపు.. ‘హ్యాండ్ బుక్’తో ఇంటింటికీ..
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు అక్రమ, డూప్లికేట్ ఓట్లను తొలగించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకే వ్యక్తికి వేర్వేరు నియోజకవర్గాల్లో లేదా ప్రాంతాల్లో ఓట్లు ఉండే అవకాశం ఉందని, ఉదాహరణకు లావణ్య అనే వ్యక్తికి ఐదు చోట్ల ఓట్లు ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని ఉదహరించారు. ఇలాంటి అనుమానాస్పద, డూప్లికేట్ ఓట్ల జాబితాను ప్రత్యేకంగా తయారు చేసి పార్టీ నాయకులకు అందజేయాలన్నారు. కార్యకర్తల సౌకర్యార్థం పార్టీ తరపున ‘హ్యాండ్ బుక్’, ‘వర్క్ బుక్’ అందజేస్తామని, వీటి సహాయంతో ప్రతి ఒక్కరూ ఇంటింటికీ తిరిగి ఖచ్చితమైన వివరాలు సేకరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు , కార్యకర్తలతో పూర్తిస్థాయిలో మమేకమై పనిచేస్తేనే ఎన్నికల్లో భారీ విజయం సాధ్యమవుతుందని కేటీఆర్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..