KTR:పెట్టుబడుల వేట.. మరోసారి విదేశాలకు కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేటి నుంచి పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించమే లక్ష్యంగా పర్యటన వెళ్తున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్తో పాటు స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు.
ఇవాళ ఉదయం 10 గంటలకు శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరి వెళ్తారు. లండన్లో మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీకానున్నారు.
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
ఆ తర్వాత ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు.ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్ ప్రసంగించనున్నారు.
ఈ నెల 26న తిరిగి రాష్ట్రానికి కేటీఆర్ చేరుకోనున్నారు. పర్యటనలో కేటీఆర్ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారుల బృందం వెళ్లనున్నారు.
ఈ నేపథ్యంలో యూకేలోని వెస్ట్ లండన్లోని పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘వెల్కమ్ టు లండన్.. ఇండియాస్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్’ అని టీఆర్ఎస్ ఎన్నారై నేత అనిల్ కూర్మాచలం ఏర్పాటు చేసిన పోస్టర్లు ఆకర్షణగా నిలిచాయి.
12 ఏండ్ల తర్వాత మంత్రి కేటీఆర్ లండన్లో పర్యటిస్తున్నారని, ఆయన రాక కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్నారైలే కాకుండా, పలు రాష్ర్టాలకు చెందిన ఎన్నారైలు ఎదురుచూస్తున్నారని అనిల్ కూర్మాచలం తెలిపారు. ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలను హైదరాబాద్కు రప్పించటంలో కేటీఆర్ చొరవ అసాధారణమైనదని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో, ప్రత్యేకించి ఐటీ విస్తరణలో కేటీఆర్ దేశానికి ఐకాన్గా నిలిచారని పేర్కొన్నారు.
కాగా.. March 20, 2022 లో కూడా తెలంగాణ ఐటీ – పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్ళారు. ఆయన వారం రోజుల పాటు అమెరికాలోని పలు నగరాల్లో పర్యటించారు. ప్రఖ్యాత అంతర్జాతీయ పారిశ్రామిక ప్రముఖులతో సమావేశమై.. కేటీఆర్ శాన్ డియాగో.. సానో హూజే..బోస్టన్ .. న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించారు. ప్రముఖ కంపెనీల అధిపతులు..సీఈవోలతో సమాసమయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రంతో పాటుగా ప్రత్యేకంగా హైదరాబాద్ కు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ప్రభుత్వ నిర్వహిస్తున్న మన ఊరు – మన బడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమెరికా లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు. 25వ తేదీ వరకు కేటీఆర్ అమెరికాలో పర్యటించనున్నారు. కేటీఆర్ తో పాటుగా తెలంగాణ ఐటీ .. పరిశ్రమల శాఖల ముఖ్య అధికారులు సైతం ఈ పర్యటనలో ఉన్నారు.
తాజావార్తలు
-
Petrol and Diesel Prices Cut: భారీ ఉపశమనం.. పెట్రోల్, డీజిల్ లీటర్పై రూ.22 తగ్గించిన పాక్..
-
Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
-
Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..